-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -ముఖ్యమంత్రి వారి చొరవతో రాష్ట్రానికి ప్రస్తుత రబీ సీజన్ వరకు సమృద్ధిగా ఎరువుల సరఫరా చేసిన కేంద్ర ఎరువుల శాఖ -రాబోవు ఖరీఫ్ సీజన్ నుండి ఎరువుల బఫర్ నిల్వ లకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచటం పై హర్షం ధన్యవాదములు వ్యక్తం చేసిన వ్యవసాయ అధికారులు -యూరియా అమ్మకం ధరల నియంత్రణకు,యూరియా తయారిదారుల నుండి రిటైల్ ఎరువుల వ్యాపారుల వరకు ఉచిత లారీ రవాణా సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం …
Read More »Daily Archives: March 19, 2025
లాభదాయక పంటలకు ప్రాధాన్యమివ్వాలి
– పంట మార్పిడి విధానాన్నీ అనుసరించాలి – తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధించాలి.. – రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఎప్పుడూ ఒకే పంట కాకుండా లాభదాయక పంటలకు ప్రాధాన్యమివ్వాలని.. పంట మార్పిడి విధానాన్ని కూడా అనుసరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ప్రస్తుతం …
Read More »పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం చందర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఉష్ణోగ్రతలు నేపథ్యంలో తాగునీటికి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రం గదుల్లో ఏర్పాటుచేసిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు.
Read More »ఉపాధి హామితో చిన్న సన్నకారు రైతులకు ఊతం..
-ఉపాధి హామి ద్వారా పండ్లు, పూల తోటల పెంపకం.. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి ఊతంతో చిన్న సన్నకార రైతులకు నూరు శాతం సబ్బిడి క్రింద ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నామని జిల్లాలో ఈ ఏడాది సుమారు 1300 ఎకరాలలో పండ్లు, పూలు, మునగ తోటల పెంపకాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో …
Read More »రీసర్వేలో పారదర్శకతకు పెద్ద పీట..
– భూ లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర భూ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని.. అత్యంత జవాబుదారీతనంతో భూ లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం చందర్లపాడు మండలం, ఉస్తేపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రామ సరిహద్దుల నిర్ధారణ, రెండోదశ రీసర్వే డేటా సేకరణ కార్యకలాపాలను తనిఖీ చేశారు. రైతులతో ముచ్చటించి రీసర్వేతో భవిష్యత్తులో చేకూరే …
Read More »అడవి ఆవుల బారినుంచి రైతులకు రక్షణ కల్పిస్తాం
– అడవి ఆవులను గోశాలకు తరలించేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చందర్లపాడు మండలం సమీపంలోని కృష్ణానది తీరప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అడవి ఆవులను బంధించి, ప్రత్యేక గోశాలకు తరలించి అన్నదాతలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. చందర్లపాడు మండలం, వెలది గ్రామ సమీపంలో అడవి ఆవుల వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. స్థానిక అధికారులతో …
Read More »గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలి, బస్సు సౌకర్యం కల్పించాలి
-ప్రభుత్వాధికారులకు వినతి ప్రతం అందజేసిన పంచాయతీ ఛాంపియన్స్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ని ఆర్.డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.రామలింగ ప్రసాద్ కు గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను …
Read More »ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలి
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాల పై ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు -తిరువూరు 9వ,11వ,12వ,16వ వార్డుల్లో విస్తృత సమావేశాలు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్త గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు …
Read More »గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలి
-ఎమ్.డి.వో కి వినతి ప్రతం అందజేసిన పంచాయతీ ఛాంపియన్స్ వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి.వి.నరసింహారావు ఆధ్వర్యంలో మండల నీటి సంఘం అధ్యక్షుడు కాపా రాంబాబు లతో కలిసి గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను తక్షణం పరిష్కారించాలని …
Read More »సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పశ్చిమ నియోజకవర్గం లోనీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు నైపుణ్య శిక్షణనిస్తున్నారు.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరచడానికి కేబీఎన్ కళాశాల ఆవరణలో బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యకు ధీటుగా అంగన్వాడీల్లో చిన్నారులకు విద్యపై ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దనున్నారు. బుధవారం జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో పోరంకి లోని వికాస విద్యా …
Read More »
Prajavartha Online Telugu News