Breaking News

Daily Archives: August 2, 2026

పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనానికి హైపవర్డ్ కమిటీ

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో నియామకం -నల్లమలలో అనుమానాస్పద స్థితిలో పులి మరణంపై పవన్ కళ్యాణ్ సీరియస్ -పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమగ్ర నివేదికకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పులులే అడవులకు ప్రాణం… అడవులే ప్రకృతి సమతుల్యతకు ఆధారం. పులుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశంలోనే …

Read More »

అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి

-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ -పురాణాల్లో రాక్షలు మాదిరిగా వ్యవహారిస్తున్న వైకాపా నాయకులు -పశ్చిమ ఇంచార్జ్ బుద్దా వెంకన్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాష్ట్ర పురోగతిని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన 40 …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 3వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

న్యాయవాదుల సేవలు లేకుండా ఏ రాజకీయ పార్టీ సమర్థంగా ముందుకు సాగదు

-మన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా… దూషించినా తక్షణమే ఫిర్యాదులు చేయాలి -కఠిన చర్యలు తీసుకోనేలా చట్ట ప్రకారం ముందుకు వెళ్దాం -చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో న్యాయవాదుల సేవలు అమూల్యం -పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు అండగా ఉందాము -వారిపై గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుతో అన్యాయంగా నమోదైన కేసులను పరిష్కరించేలా సమగ్ర కార్యాచరణ చేపడదాము -జిల్లాలవారీగా కార్యకర్తల కేసుల పూర్తి వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపించండి -వారికి న్యాయ సహాయం …

Read More »

మిద్దె తోటలతో ఆరోగ్య మహాభాగ్యం..

-మిద్దె తోటలతో పచ్చని ప్రగతి.. ఆరోగ్యకర భవిష్యత్ -హరిత సమాజ నిర్మాణానికి సీటీజీ కృషి భేష్ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిద్దె తోటలతో ఆరోగ్యకర హరిత సమాజ నిర్మాణం సాధ్య పడుతుందని.. ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబానికి తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సిటీ …

Read More »

రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం..

-వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట -రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్‌ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం -రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ, వినియోగదారుల …

Read More »

పీజీఆర్ఎస్‌పై స్పందనకు ప్ర‌త్యేక క్యూఆర్ కోడ్

– ఈ నెల 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ.. – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని.. అదే విధంగా అర్జీదారులు త‌మ స్పంద‌న తెలియ‌జేసేందుకు ప్ర‌త్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. …

Read More »

కళా వైభవానికి ప్రతీక బళ్లారి రాఘవ..

-తెలుగు నాటక రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలందించిన మహానటుడు బళ్లారి రాఘవ కళా వైభవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

నాటక పితామహుడు బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటకరంగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, నాటక పితామహుడు బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని విజయవాడ నగర పాలక సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) వి. చంద్రశేఖర్ కొనియాడారు.ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బళ్లారి రాఘవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ ఇంజనీర్ వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకరంగంపై …

Read More »