విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్ను సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్గాను, ఇటు డిజిటల్ సోషల్ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కావీరభద్రరావు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News