Breaking News

Daily Archives: March 4, 2025

అరుదైన వ్యాధులపై సమగ్ర చర్యలు తప్పనిసరి

-వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరుదైన వ్యాధులపై సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఆధ్వర్యంలో అరుదైన వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సును విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ అధ్యక్షుడు, …

Read More »

యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి

-మంత్రి లోకేష్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు రాజా, రాజశేఖర్ అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ మంగళవారం మంగలగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. …

Read More »

మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ

-మూడు రోడ్ల అభివృద్ధికి రూ.9.86 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మంగళగిరి,  నేటి పత్రిక ప్రజావార్త : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గంలోని 3 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు రూ. 9.86 కోట్లు మంజూరయ్యాయి. ఈ క్రమంలో త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. దుగ్గిరాల-కొల్లిపర్ర, ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక రోడ్డు, దుగ్గిరాల-పెదపాలెం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 9 కోట్ల 86 లక్షల నిధులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణ్ లో రాజమండ్రికి ఓటు వేయండి

-మన నగరాన్ని గర్వపడేలా చేయండి -యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి -కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన స్థానం కొరకు వార్డు ప్రత్యేకాధికారులు, అందరు విభాగాధిపతులు సమన్వయంతో పనిచేయాలనీ నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్పిలుపు ఇచ్చారు. స్వచ్చ భారత్ బృందం సభ్యులు నగరమునకు క్షేత్రస్థాయి పరిశీలనకు రాబోతున్నందున వార్డు ప్రత్యేకాధిపతులు మరియు అన్ని విభాగాధిపతులు వారికి కేటాయించబడిన విధులను సక్రమంగా నిర్వహించవలసినదిగా మంగళవారం ఆదేశించియున్నారు. విభాగాధిపతులు క్రింది స్థాయి సిబ్బందితో …

Read More »

సమన్వయ శాఖల అధికారులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో చేపల వేట ద్వారా జీవనో ధారం తో పాటు, పర్యటక అభివృద్ది పరంగా బోటింగ్, నది విహారం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అయితే వీటికి సంబంధించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలక్టర్ స్పష్టం చేసారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నది జీవనం పై జీవనభృతి ఉన్న వారికి …

Read More »

వివిధ చట్టాల పై అవగాహన కల్పించేందుకు క్యాండిల్ ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో చైతన్యం తీసుకువచ్చి మహిళ కోసం అమలు అమలు చేస్తున్న వివిధ చట్టాల పై అవగాహన కల్పించేందుకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక సరస్వతి ఘాట్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఎస్. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను …

Read More »

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా ఏర్పాట్లు చేయాలి…

-ఆర్ట్స్ కాలేజీలో మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలి -వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో అధికారులు భారీగా ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్ర శాంతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ ల అధికారులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సమీక్ష సమావేశం నిర్వహించారు. …

Read More »

వీరంపాలెం, చంద్రేడు గ్రామాలలో కలక్టర్ పర్యటన

-శానిటేషన్, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పరిశీలన -కలక్టర్ పి ప్రశాంతి రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : రామన్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన త్రాగు నీరు ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేట మండలం వీరం పాలెం, చంద్రేడు గ్రామాలలో ఎంపిడివో, ఇతర క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది సమక్షంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవల చంద్రేడు గ్రామంలో డయేరియా కేసు నమోదైందినీ, ఇందుకు శానిటేషన్ , …

Read More »

మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు గురించి అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు పనిచేసే ఆఫిసుల్లో, ప్రాంతాలలో, మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు (sexual harassment act ) గురించిన పూర్తి అవగాహనను, మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎస్. శ్రీలక్ష్మి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు పేర్కొన్నారు. స్ధానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళ దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా మహిళ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన, జిల్లా …

Read More »

గ్రామీణ మహిళల సుస్థిర భవిష్యత్తుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

-కృష్ణారావు పాలెం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయతీ ఛాంపియ‌న్స్ స‌మావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో స‌మగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్ష‌ణ పొందిన పంచాయ‌తీ చాంపియ‌న్స్ మంగ‌ళ‌వారం ఎ.కొండూరు మండ‌లం కృష్ణారావుపాలెం గ్రామ ప్ర‌జ‌ల‌తో సమావేశం నిర్వ‌హించారు. గ్రామాల్లో తాగునీరు-సాగునీరు స‌మ‌స్య రాకుండా, వ్య‌వ‌సాయం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, వైద్యం, విద్య, ఉపాధి అవ‌కాశాలు ఎలా అభివృద్ది చేసుకోవచ్చు అనే అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. …

Read More »