Breaking News

Daily Archives: March 18, 2025

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో పోలీసు డిపార్ట్మెంట్ వారు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ACP దామోదర్ మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా మహిళలకు పిల్లలకు భద్రత కల్పిస్తామని ప్రతి ఒక్కరి ఫోన్ లో ఈ యాప్ వుండాలని ,రెస్క్యూ సేవలు,షెల్టర్ కల్పించటం తక్షణ చికిత్స వంటి సేవలతో పాటు, కాల్ చేయగానే డిపార్ట్మెంట్ వారు సహాయం అందిస్తారని అన్ని కళాశాల యాజమాన్యాలు ఈ యాప్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో …

Read More »

రాష్ట్రంలో క్రీడలకు పునర్ వైభవం

-ప్రజాప్రతినిధులకు క్రీడలు ఆటవిడుపు -ప్రజాప్రతినిధుల ఆటలతో కోలాహలంగా ఇందిరా గాంధీ స్టేడియం -చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు, రాష్ట్ర శాసనసభ స్పీక‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యులకు ఆట‌విడుపు క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం క్రీడ‌లను ప్రారంభించిందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు తెలిపారు. శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండలి స‌భ్యుల క్రీడా పోటీలను విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంగళవారం మంత్రులు, ఉపసభాపతి కే. రఘురామ కృష్టం రాజుతో కలసి ప్రారంభించిన అనంతరం రాష్ట్ర శాసనసభాపతి అయ్య‌న్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు రోజూ బిజీగా …

Read More »

ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– హ‌రిత విస్తీర్ణం పెంపున‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – అట‌వీ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా ప‌టిష్ట నిఘా అవ‌స‌రం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ (రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్‌) ప‌ట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, …

Read More »

డిజిటల్ కామర్స్ ప్రభుత్వ ఆన్లైన్ వేదిక ద్వారా చిరుధాన్యపు ఉత్పత్తుల విక్రయాలకు అవకాశం

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో జాతీయ ఆహార మరియు పోషక భద్రతా పధకం లో చిరుధాన్యపంటల సాగు ,ఉత్తమ యాజమాన్యం పద్ధతులు ,నూతన ఆవిష్కరణలు అనే అంశం పై జరిగిన కార్యాశాలలో పాల్గొన్న డిల్లీ రావు .రాయలసీమ , ఉత్తర కోస్తా ,ప్రకాశం ,పల్నాడు జిల్లాల ఎంపిక చేసిన రైతులు ,ప్రధాన పంట శాస్త్ర వేత్తలు ,ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు . ఈ సమావేశములో డిల్లీ రావు ప్రారంభ ఉపన్యాసం …

Read More »

నాటుసారా ర‌హిత జిల్లా ల‌క్ష్యంగా కొత్త న‌వోద‌యం

– స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేద్దాం.. – రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు – నవోద‌యం 2.0 కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాన్ని, మండ‌లాన్ని, జిల్లాను త‌ద్వారా రాష్ట్రాన్ని నాటుసారా ర‌హితంగా మార్చేందుకు, స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేసే ల‌క్ష్యంతో న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం తిరువూరులో జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ …

Read More »

ప్రతి మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ (పోనిక్) ప్రతినిధి జాన్సన్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగ్ నగర్ లోని 59 వ డివిజన్ కమ్యూనిటీ హాలు లో మంగళవారం మహిళలు, బాలల చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన పోనిక్ ప్ర‌తినిధులు జాన్సన్, శారదలు మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు …

Read More »

బలహీన వృత్తుల పురుషుల స్వయం సహాయక గ్రూప్ ల ఏర్పాటు లోఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో రాజా నగరం MLAబత్తుల బలరామ కృష్ణ  అడిగిన పురుష సంఘాలు ఎన్ని ఏర్పాటు చేసారు అన్న ప్రశ్న కు సమాధానంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు  పొంగూరు నారాయణ బలహీన వర్గాల పురుషులకు 6 రకాల వర్గాలకు (నిర్మాణరంగం, గృహసంబంధ వర్కర్లు, సంరక్షణ వర్కర్లు, వ్యర్థాల నిర్వహణ వర్కర్లు ,రవాణా వర్కర్లు, గిగ్ వర్కర్లు) చెందినవారికి మాత్రమేవల్నరబుల్ గ్రూప్ లు గా ఏర్పాటు చేసే అవకాశం వుంది అని …

Read More »

సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో 146 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

-డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) ప‌రిథిలోని ఆసుపత్రుల్లో డైరెక్ట్ మ‌రియు లేట‌ర‌ల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీ కి ఈనెల 26న వాకిన్ ఇంట‌ర్వ్యూకి అర్హులైన అభ్యర్ధులను ఆహ్వనిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన అర్హ‌త‌లు ఇత‌ర వివ‌రాల కోసం htps://dme.ap.nic.in మ‌రియు http://apmsrb.ap.gov.in/msrb/. వెబ్ సైట్ల‌ను సంప్రదించాలని సూచించింది. …

Read More »

ప్ర‌కృతి విపత్తుల స‌మ‌యంలో విద్యుత్ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి

-బీసీ ఉద్యోగుల‌ సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో విద్యుత్ శాఖ‌ మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌కృతి విప‌త్తులు, ఆప‌త్కాల స‌మ‌యాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండ‌ర్ ను మాజీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి క‌ళా వెంకట్రావుతో క‌లిపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వ అనాలోచిత చ‌ర్య‌ల‌తో, సంస్థాగ‌తంగా విద్యుత్ శాఖ …

Read More »