Breaking News

Daily Archives: April 8, 2025

ఏపీ ఎస్పీఎఫ్ ఏపీ సెక్రటేరియట్ యూనిట్ నందు రక్త పరీక్షలు 

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ మరియు ఐజి B.V.రామిరెడ్డి వారి ఆదేశములు మేరకు రాష్ట్రంలో ఉన్న SPF సిబ్బంది అందరికి రక్త పరీక్ష నిర్వహణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు కమాండెంట్ ఎం.శంకర్రావు వారి ఆధ్వర్యంలో APSPF అధికారులకు మరియు సిబ్బందికి మంగ‌ళ‌వారం  సిబ్బంది యొక్క ఆరోగ్య దృష్ట్యా APSPF హెడ్ క్వార్టర్స్ వారు రక్త పరీక్షలు ఉచితముగా నిర్వహించటం జరిగింది అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ పి. వి. ఎస్. …

Read More »

పంచాయతీల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

-సర్పంచుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తాం -అరకులో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం, గిరిజన సర్పంచులతో సమావేశమైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. పంచాయతీల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి పరిష్కారానికి అవకాశం ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల …

Read More »

వాలంటీర్ల పేరుతో గత పాలకులు వంచించారు

-వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు లేవు -ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ యువతను మోసం చేశారు -వాలంటీర్లకు గతంలో ఇచ్చిన హామీపై క్యాబినెట్ లో పలుమార్లు చర్చించాం -ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి సేంద్రీయ వ్యవసాయం పెరగాలి -కేరళ తరహా పర్యాటకం మన దగ్గర అధికమవ్వాలి -ఏజెన్సీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కురిడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే …

Read More »

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్

-కెనోపీ వాక్ ప్రారంభించి కాఫీ తోట మధ్య నడచిన ఉప ముఖ్యమంత్రివర్యులు -ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.19 లక్షల వ్యయంతో చెక్క వంతెన నిర్మాణం -కాఫీ, మిరియాల తోటల పెంపకంపై ఆరా -ట్రీడెక్స్, బర్డ్ నెస్ట్, వృక్ష జాతుల ఎగ్జిబిషన్ సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎకో టూరిజం అభివృద్ధిలో అరకు మండలం, సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన చక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా …

Read More »

కురుడి శివాలయంలో పవన్ కళ్యాణ్ అభిషేకార్చనలు

-గిరిజన గ్రామస్తుల కోరిన మేరకు కురుడి గ్రామ సందర్శన అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అరకు నియోజకవర్గం పరిధిలోని కురుడి గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కురుడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. గ్రామస్తురాలు శ్రీమతి రాములమ్మ, ఆలయ కమిటీ సభ్యులతో కలసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ …

Read More »

మార్క్ శంకర్ కి ప్రాణాపాయం లేదు… కాళ్లు చేతులకు కాలిన గాయాలయ్యాయి

-ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారు -ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం, 30 మంది చిన్నారులు గాయపడడం కలచివేసింది -ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు కృతజ్ఞతలు -కష్టకాలంలో అండగా నిలచిన ప్రధాని మోదీ కి, సీఎం  చంద్రబాబు తోపాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు -హైదరాబాద్ లో మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘సింగపూర్ లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన నా రెండవ కుమారుడు మార్క్ శంకర్– అక్కడ తరగతి …

Read More »

శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ నది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ…. పెనుమాక గ్రామంలో కల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజులపాటు 365 రోజులపాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ …

Read More »

వెట్టిచాకిరి ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం

-నివేదిక కోరిన చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకకు చెందిన ఎస్టీ సామాజిక వర్గ దంపతుల వెట్టి చాకిరీ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక పంపాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ఆదేశించారు. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ నంబూరు పద్మ, అగ్ని దంపతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన బాపట్ల కలెక్టర్ ను చైర్మన్ అభినందించారు.వెట్టిచాకిరి చేయించడంతో పాటు, దంపతులను అమ్మకానికి పెట్టడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం …

Read More »

హాస్టల్స్ స్కూల్స్ ఆకస్మిక తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి, ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి గ్రామంలో ఉన్న కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శ్రీ చైతన్య కాలేజీలను మరియు పలు హాస్టల్స్ స్కూల్స్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో సందర్శన వివరాలు : సభ్యురాలు ముందుగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తో సమావేశమై, పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యా కార్యక్రమాల గురించి …

Read More »

స‌హ‌కార స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌

– అంత‌ర్జాతీయ స‌హ‌కార సంవ‌త్సరం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాలి – భాగ‌స్వామ్య ప‌క్షాలు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలి – డీసీడీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్య స‌మితి 2025ను అంత‌ర్జాతీయ స‌హ‌కార సంవ‌త్స‌రం (International Year of Cooperatives) గా గుర్తించిన నేప‌థ్యంలో వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌హ‌కార స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా ఏడాదంతా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం 4వ జిల్లా స‌హ‌కార …

Read More »