విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్కాన్ విజయవాడ వారు” శ్రీ జగన్నాథ రథయాత్ర “ని ఈరోజు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సితార గ్రౌండ్స్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు రథపూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం 3 గంటలకు రథయాత్ర వేలాది మంది భక్తులు మరియు కళాకారుల బృందాలతోనూ ఇతర రాష్ట్రాల మరియు దేశ విదేశీయ భక్తులతోనూ సితార గ్రౌండ్స్ దగ్గర ప్రారంభమైన రథయాత్ర శివాలయం సెంటర్, స్వాతి థియేటర్ మీదుగా కుమ్మరి పాలెం సెంటర్ రథం సెంటర్ దాటుతూ సీతమ్మ వారి …
Read More »Daily Archives: June 27, 2025
ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా డా.వేమూరు రవికుమార్
-తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం -రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్టీ వారధిలా పని చేస్తుంది -ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం -మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు -ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో …
Read More »శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు, అభివృద్ధి
-ఏఐ సాయంతో జీరో క్రైమ్ రేట్ -వివేకా హంతకులను పట్టించింది టెక్నాలజీనే -ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపినిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేకా హత్య కేసే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేరాల కట్టడికి.. వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ …
Read More »ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ హౌసింగ్, విద్యుత్ ,ఆర్డబ్ల్యూఎస్ ,పంచాయతీ రాజ్, కాంట్రాక్టర్లు ,ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గాల వారీగా లేఅవుట్ల వారీగా …
Read More »పేదలందరికీ సకల సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు కట్టిస్తాం
-రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని గృహ నిర్మాణ లేవుట్ల పరిశీలన, లబ్ధిదారులతో మాటామంతి విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేదలందరికీ సకల సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఎన్.టి.ఆర్. కాలనీల్లోని పెండింగ్ పనులను అతి త్వరలోనే పూర్తి చేసి ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల, అనకాపల్లి జిల్లా సబ్బవరం …
Read More »భవిష్యత్తు అంతా పర్యాటకానిదే
-2047 నాటికి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా ఏపీ -ఏపీలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి..స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఇన్వెస్టర్లకు భరోసా -ఏపీ చారిత్రక వైభవం, వైవిధ్యమైన సహజసిద్ధ సౌందర్యాలను ప్రపంచానికి తెలపాలన్నదే తమ ఉద్దేశం -విజయవాడలో ఏపీ పర్యాటకాభివృద్ధి కోసం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహించిన టూరిజం కాన్ క్లేవ్ టెక్ ఏఐ 2.0లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -టూరిజం కాన్ క్లేవ్ లో రాష్ట్ర పర్యాటక విధానాలు, నిర్దేశిత లక్ష్యాల వివరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవం
-రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి నూతన రథసారథులు -మంత్రి సమక్షంలో శాప్ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా నియమితులైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, “రాష్ట్రంలో క్రీడా …
Read More »గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఏపీ
-గేమ్ చేంజర్ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా -ఏ ఇజమూ కాదు టూరిజమే కీలకం -పర్యాటక రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు -పర్యాటక శాఖ సలహాదారుగా యోగాగురూ బాబా రామ్ దేవ్ -జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -టూరిజం క్యారవాన్లను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి -సీఎం సమక్షంలో రూ.10,329 కోట్ల విలువైన 82 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీటీడీసీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గేమ్ …
Read More »ఖనిజ వనరుల నిర్వహణ యొక్క కొత్త శకానికి ఇది నాంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మైనర్ మినరల్స్ కోసం అప్లికేషన్-బేస్డ్ లీజ్ సిస్టమ్ను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18.04.2025 తేదీ G.O. Ms. No. 57 ద్వారా మైనర్ మినరల్ పాలసీ 2025ను ప్రవేశపెట్టింది, ఇది రాష్ట్రంలో మైనర్ ఖనిజ వనరుల నియంత్రణ మరియు కేటాయింపులో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ విధానం గ్రానైట్, మార్బుల్ మరియు నిర్మాణ సామగ్రి కోసం లీజులను మంజూరు చేయడానికి అప్లికేషన్-బేస్డ్ సిస్టమ్ను తిరిగి ప్రవేశపెట్ట బడుతోంది. …
Read More »క్రీడల అభివృద్ధికి కూటమి కృషి
-అమరావతిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కృషి -స్పోర్ట్స్ అథారిటీకి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సహకరిస్తుంది -గత ఐదేళ్లలో క్రీడాకారులకు తీవ్ర అన్యాయం -మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం -క్రీడాకారుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు -శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో క్రీడల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని, …
Read More »
Prajavartha Online Telugu News