Breaking News

Monthly Archives: July 2026

ప్రత్యేక ఫ్రాంచైజీ ప్రాజెక్టుల ద్వారా స్వయం ఉపాధికి డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఫ్రాంచైజీ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంచార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ నిరుద్యోగ మహిళలు, యువతులు తక్కువ పెట్టుబడితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రముఖ …

Read More »

రహదారుల పైన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించండి

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ.రవీంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు బుధవారం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక రాణిగారితోట, నేతాజీ బ్రిడ్జ్, పశువుల ఆసుపత్రి జంక్షన్, జాతీయ రహదారి పరిసర ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సాయిబాబా ఆలయం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి సేవలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ, నేతాజీ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన మొక్కలు ఎల్లప్పుడూ …

Read More »

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదు

-అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలి -తాగునీటి, మరుగుదొడ్ల పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలి -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్), ఐసీడీఎస్, జిల్లా పంచాయతీ తదితర శాఖల …

Read More »

స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు

-వేగం మరింత పెరగాలి…అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలి -రాజధాని పనులపై కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని….అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని సీఎం అన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత మేర పెరిగినా… ఇంకా వేగం పెంచాలన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని …

Read More »

కష్టకాలంలో రైతులకు అండగా ఉండాలి

-ఎల్ నినో యాక్షన్ ప్లాన్ అమల్లో నిర్లక్ష్యాన్ని సహించను -తాగునీటి సమస్య తలెత్తకూడదు -ప్రతి పంటకు బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదే -నిరంతరం మానిటరింగ్ చేసేలా ఎల్ నినో కంట్రోల్ రూమ్ -ఎల్ నినోపై క్షేత్ర స్థాయి అంచనాలు… ప్రణాళికలు ఉండాలి -ఏడాదికి సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు -ఎల్ నినోపై ఆర్ఎస్కేల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఆగస్టు 3 నుంచి ఎల్ నినోపై అవగాహన కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని… …

Read More »

అమరావతిలో జెనోమిక్ సొల్యూషన్ సెంటర్

-ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చకున్న ఆస్ట్రాజెనెకా ఇండియా -దేశంలోనే మొదటి ప్రెసిషన్ అంకాలజీ పరిశోధనకు ఒప్పందం -సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న ఫార్మా సంస్థ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ …

Read More »

ఎల్ నినో నుంచి రైతులను ఆదుకోండి

-సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కె.రామకృష్ణ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 54 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని, 249 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని …

Read More »

ఆర్టీజీఎస్ ను సంద‌ర్శించిన‌ రాజ‌స్థాన్ ఐటీ బృందం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగ‌ళవారం సంద‌ర్శించింది. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ రాజ్‌కాంప్ ఇన్ఫో స‌ర్వీసెస్ లిమిటెడ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ల‌క్ష్మీకాంత్ క‌టార‌, రాజ‌స్థాన్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిపార్టుమెంట్‌కు చెందిన బ్ర‌హ్మ‌గుప్త సెంట‌ర్ ఆఫ్ ఫ్రంటీయ‌ర్ టెక్నాల‌జీస్ సంస్థ నోడ‌ల్ ఆఫీస‌ర్ ర‌మేష్ ద‌వాండ‌, డిప్యూటీ డైరెక్ట‌ర్ నితీష్ కుమార్ జంగ‌డిల నేతృత్వంలో అధికారుల‌తో కూడిన ప్ర‌తినిధుల బృందం …

Read More »

గాజువాకలో రూ.2000 కోట్ల విలువైన భూమిని జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తాం

-ఉప సభాపతి,అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె.రఘురామకృష్ణ రాజు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో దాదాపు రూ.2000 కోట్లు విలువ చేసే 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తు నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని ఉప సభాపతి మరియు అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె.రఘు రామకృష్ణ రాజు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది.అనంతరం అసెంబ్లీ భవనంలోని ఆయన చాంబరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప …

Read More »

పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి

-క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశం -సంబంధిత రోడ్ల బిల్లులు నిలిపివేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి -పెదపెంకిలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత పనుల బిల్లులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌తోపాటు …

Read More »