– ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అసలైన బలం – ఓటు హక్కు.. కేవలం హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా – ఓటు విశిష్టత స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలి – ఓటర్ల అర్హత అంశంపై 9-సోపానాల ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం – విస్తృత వినియోగం లక్ష్యంగా నమూనా ప్రమాణాల రూపకల్పనకు కసరత్తు – ఓటర్ల అర్హతపై అత్యుత్తమ విధానాలపై అంతర్జాతీయ వర్క్షాప్లో వక్తల మాట విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ప్రతి ఓటు …
Read More »Monthly Archives: July 2026
బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల సమన్వయం అవసరం
-బాలల చట్టాలు, భద్రతపై జిల్లా స్థాయి ఒకరోజు వర్క్షాప్ నిర్వహణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, చట్టాల అమలుపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని విజయశ్రీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఒకరోజు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్. …
Read More »రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా (ఎఫ్ఏసీ) బాధ్యతలు చేపట్టిన పి. జయరావు మంగళవారం మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జయరావుకు శుభాకాంక్షలు తెలియజేసి, విధుల నిర్వహణలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
Read More »సేవాభావంతో పనిచేసే నర్సులే వైద్య వ్యవస్థకు వెన్నెముక… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సేవాభావంతో పనిచేసే నర్సులే వైద్య వ్యవస్థకు వెన్నెముక అని, రోగుల సంరక్షణలో నర్సులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, వారి సేవా నిబద్ధతే వైద్య రంగానికి బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం పోతేపల్లి గ్రామంలోని గ్రేస్ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ 11వ బ్యాచ్ రిలీవింగ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, …
Read More »ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారించాలని, ప్రధాన రహదారులు, …
Read More »ప్రతి ఇంట్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
-“క్యాచ్ ది రైన్–2026″లో ప్రజలంతా భాగస్వాములు కావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటిని ప్రతి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శాఖాధిపతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు. కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో …
Read More »ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్పోర్ట్
-ఎయిర్ పోర్టుతో పాటు జీఎమ్మార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్శిటీ, ఎడ్యుసిటీలను ప్రారంభించనున్న ప్రధాని -ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆగస్టు 1 తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన …
Read More »ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
-సొయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వండి -అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయం అవసరం -డీజీఎఫ్టీ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతి నియంత్రణ -ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించండి -ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించండి -ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా సీఎం చంద్రబాబు లేఖలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీ దారులకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ …
Read More »సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం
-డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తాం -దీపం-2.0 లబ్దిదారులకు నిర్థారిత తేదీల్లో నగదు జమ -ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని… దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సేవల సులభతరానికే …
Read More »సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు
-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన జీవో నెంబర్ 3ను గత ప్రభుత్వం పరిరక్షించలేకపోయింది -జోన్-1లోకి అల్లూరి సీతారామరాజు జిల్లా, జోన్-2లోకి పోలవరం జిల్లా -బాక్సైట్ విషయంలో ఆందోళన వద్దు…అవినీతితో అంతర్జాతీయ సమస్యగా మార్చారు -ఎస్టీల సంక్షేమం, అభివృద్దిపై సిఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని…ఈ విషయంలో గిరిజన ప్రజలు ఎటువంటి ఆందోళనకు, అనుమానాలకు గురి …
Read More »
Prajavartha Online Telugu News