Breaking News

Monthly Archives: July 2026

రాష్ట్రంలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల ఫేజ్-2 విస్తరణకు ప్రభుత్వం ఆమోదం : పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

-సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూసేకరణకు పరిపాలనా అనుమతులు -మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు రూ. 1638.52 కోట్లు మంజూరు -రామాయపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 2924.45 ఎకరాల భూసేకరణ.. రూ. 851 కోట్లు కేటాయింపు -మూలాపేట పోర్ట్ విస్తరణకు 1903.39 ఎకరాల సేకరణ.. రూ. 440.52 కోట్లు మంజూరు -మూలాపేటలో ఉప్పు భూముల సేకరణ, ఆర్ & ఆర్ (R&R) పనుల నిర్వహణ -మచిలీపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 1420.70 ఎకరాల సేకరణ.. రూ. 347 కోట్లు కేటాయింపు -తిరుపతి జిల్లాలో నెక్సస్ …

Read More »

ఆర్ &బీ శాఖలో 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆమోదం

-సచివాలయం ఆర్ & బీ మంత్రి కార్యాలయంలో కే. లక్ష్మణ్ కుమార్ కు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -కాకినాడ డివిజన్ లో పనిచేస్తూ మరణించిన గ్యాంగ్ మజ్దూర్ కే.వీ అప్పారావు కుమారుడికి లభించిన ఉద్యోగం -కారుణ్య నియామకాల బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు -ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం -17 ఏళ్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి జనార్థన్ …

Read More »

జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత రాక

కడప, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడపకు విచ్చేశారు. బుధవారం జమ్మలమడుగులోని దాల్మియ సిమ్మెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 3,478 కోట్లతో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ లైన్-2 ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. …

Read More »

స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి నిరసనగా జులై 22న జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు

-రైతు సంఘాల నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆమెరికాతో భారత దేశం చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం వలన వ్యవసాయ రంగం మరింత సంక్షొభంలో పడుతుందని, రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. మంగళవారం విజయవాడనగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వవిధ రైతు సంఘాల రాష్ట్ర నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఏపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య వలన దేశీయ …

Read More »

నగరంలో ఈనెల 16న జగన్నాథ రథయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16న శ్రీ జగన్నాథ రథయాత్ర-2026ను వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నగర అధ్యక్షులు చక్రధారిదాస్ తెలిపారు. మంగళవారం సీతమ్మ వారి పాదాల వద్ద గల ఇస్కాన్ శిబిరంలో చక్రధారిదాస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఇస్కాన్ ఉత్సవ్ మేళాలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16వ తేదీ మధ్యాహ్నం విద్యాధరపురం …

Read More »

ప్రైవేట్ బస్సుల పన్ను తగ్గింపుపై కూటమి ప్రభుత్వానికి ఘనంగా కృతజ్ఞత సభ…

-ఏపీ ప్రైవేట్ బస్సు అసోసియేషన్ నూతన లోగో, “థాంక్యూ సీఎం సార” సందేశంతో ఉన్న బస్సును ఆవిష్కరించిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతరాష్ట్ర బస్సుల పన్ను 4,000గా ఉన్న పన్నును 2,500 వరకు తగ్గింపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని సృజన కళ్యాణ అవెన్యూలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి …

Read More »

పశువుల ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్ కాలర్ టెక్నాలజీ రూపకల్పన,పశుసంవర్ధక రంగంలో సాంకేతిక విప్లవానికి ‘పశు-AI’ యాప్ ప్రతిపాదన

-పశుసంవర్ధక రంగంలో AI ద్వారా సాంకేతిక విప్లవానికి ప్రతిపాదన -రాయచోటికి చెందిన MindT సంస్థ రూపొందించిన AI ప్రాజెక్టుపై మంత్రి మండిపల్లికి ప్రజెంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని సచివాలయంలో MindT Private Limited సంస్థ ప్రాజెక్టు రూపకర్త ఆసిఫ్ షాహాబుద్దీన్ ఖాదర్ వలీ మర్యాదపూర్వకంగా కలిసి Pashu-AI (పశు-ఏఐ) లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును వివరించారు. సోలార్ శక్తితో పనిచేసే స్మార్ట్ కాలర్ల ద్వారా పశువుల ఆరోగ్య పరిస్థితిని …

Read More »

విదేశీ పెట్టుబడి దారుడికి తప్పని వేధింపులు…

-ఏపీఎంఎంఎస్ డైరెక్టర్ సంగ్ హన్ కిమ్, ఆవేదన.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం పెనుకొండ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఆకాంక్షతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను నమ్మి పెట్టుబడి పెట్టిన తనకు ప్రస్తుతం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఏపీఎంఎంఎస్ (ఏపీ ఎంఎంఎస్) ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంగ్ హన్ కిమ్, ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ. కియా మోటార్స్ అనుబంధ పారిశ్రామిక …

Read More »

25న సంజీవ‌ని ప్రాజెక్టు 6వ విడ‌త కార్య‌క్ర‌మాన్ని క‌ర్నూలు జిల్లాలో ప్రారంభించ‌నున్న సీఎం చంద్ర‌బాబు

-వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి గ‌ణేశ‌న్‌ వీర‌పాండియ‌న్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆస్ప‌రి పీహెచ్‌సిలో సంజీవ‌ని ప్రాజెక్టు ఈ నెల 25న జరిగే ప్రారంభ కార్యక్రమ ఏర్పాటపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన గ‌ణేశ‌న్ వీరపాండియన్ సంజీవని ప్రాజెక్టును సీఎం చoద్రబాబు ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వీరపాండియన్ దిశా నిర్దేశం …

Read More »

43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు

-2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు -95 వేల నుంచి భారీగా పెరిగిన పంపిణీ లక్ష్యం -రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు -మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. జూలై 15 నుంచి ఈ కార్యక్రమం …

Read More »