-జిల్లా ఇంచార్జి మంత్రి,కొలుసు పార్థసారథి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పట్టణ ప్రజలు ఇంధనాన్ని అందించాలని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ను సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబు తోకలసి పెట్రోల్ బంక్ …
Read More »Monthly Archives: July 2026
బోధనాసుపత్రుల్లో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.51 కోట్లు
-ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బోధనాసుపత్రుల్లో చిన్న చిన్న మరమ్మతు పనులు చేపట్టేందుకు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.51 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేయబోతుంది. 13 సర్వజన ఆసుపత్రులు (జీజీహెచ్ లు), 13 మెడికల్, డెంటల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు పనుల కోసం మొత్తమ్మీద రూ.34.07 కోట్లు, రూ.16.92 కోట్లు చొప్పున అవసరమవుతాయని సదరు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రతిపాదనలు …
Read More »104 అంబులెన్సుల రూపురేఖల్లో మార్పులు
-పనులకు 2 నెలల వరకు సమయం -అందుబాటులో ఉండాల్సిన వాహనాల తగ్గింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 104 సంచార వైద్యశాల(మొబైల్ మెడికల్ యూనిట్స్-యంయంయు) ద్వారా ప్రతి వ్యక్తికి 41 వైద్య నిర్ధారణ పరీక్షలు చేయు నిమిత్తం ఈ వాహనాల్లో తగు ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. 904 వాహనాల్లో ఇందుకు అవసరమైన పరికరాల ఏర్పాటు, అంతర్గత మార్పులు, రీబ్రాండింగ్ చేయడానికి విడతలవారీగా రెండు నెలల సమయం పడుతుంది. ఈ కారణంగా వాహనాల లభ్యత కొంతమేర తగ్గే అవకాశముంది. రెండు నెలల …
Read More »జీవో 396 ఉపసంహరించి దస్తావేజు లేఖరుల ఉపాధి కల్పించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ జీవనోపాధి దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో 396ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ చేశారు. అనేక మంది డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్యాంప్ వెండర్లు, అనుబంధ సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేష్రన్ల శాఖలో పీపీపీ విధానం ద్వారా సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని ఎన్టీఆర్ …
Read More »విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. సంఘం నూతన అధ్యక్షుడిగా కొత్త ముక్తేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వక్కలగడ్డ పవన్ కుమార్, కోశాధికారిగా కొత్త గణేష్ బాబు, యువ జన సంఘం విభాగం అధ్యక్షుడిగా పాలకుర్తి మోహిత్, మహిళా దళ్ విభాగం అధ్యక్షురాలిగా గర్రె ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కేవలం …
Read More »ఆంధ్రప్రదేశ్లో అదుపు తప్పిన శాంతి భద్రతలు… : ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలు, మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు, రాజకీయ హింస పెరుగుతున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇటీవల పోలీసుల వేధింపులతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సాయి కృష్ణ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు …
Read More »ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ ఏపీసీసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్లకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోలనుకొండ శివాజీ మాట్లాడుతూ, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పేపర్ లీక్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని …
Read More »కార్పొరేషన్ సిబ్బందికి అందజేసి నగర పరిశుభ్రతకు సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కమర్షియల్ వ్యర్ధాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను పూర్తిస్తాయిలో రద్దు చేశామని, సోమవారం నుండి పూర్తిస్తాయిలో అమలులోకి వస్తుందని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గతంలో గుంటూరు నగరంలో వాణిజ్య వ్యర్థాలను ప్రైవేట్ ఏజెన్సీలైన క్యూబ్ ఎనర్జీ మరియు రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల వారు సేకరించేవారని, వారు 14 వాహనాలు, 56 మంది కార్మికులతో వ్యర్ధాలను సేకరించడంతో పాటు వ్యాపారుల నుండి యూజర్ ఫీజు వసూలు చేసేవారన్నారు. …
Read More »మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వాహనదారుల భద్రతకు, ప్రయాణ సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రోడ్లపై ఉన్న గుంతలను (పోట్ హోల్స్) రాబోయే రెండు రోజుల్లోగా పూర్తిగా పూడ్చివేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతం, రెవెన్యూ కలెక్షన్ పై అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై గోతులను యుద్దప్రాతిపదికన పూడ్చివేయాలని …
Read More »పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పిజిఆర్ఎస్ కు ప్రజల నుండి అందే ఫిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, …
Read More »
Prajavartha Online Telugu News