Breaking News

Monthly Archives: March 2025

ఏప్రిల్ నెల‌లో ప్ర‌తి ఇంటికి మ‌న‌మిత్ర

-వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వాడ‌కంపై ప్ర‌తి పౌరుడికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం -ప్ర‌తి పౌరుడి ఫోనులో 9552300009 నెంబ‌రు సేవ్ చేయించండి -దీనిపైన క‌లెక్ట‌ర్లు అంద‌రూ చొర‌వ చూపాలి -ప్ర‌స్తుతం 210 సేవ‌లు అందుబాటులో -మ‌రో ప‌క్షం రోజుల్లో 350 సేవలు అందిస్తాం -వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా డిజిట‌ల్ స‌ర్టిఫికెట్లు జారీ చేయ‌బోతున్నాం -ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగం, వాడ‌కంపైన పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఏప్రిల్ …

Read More »

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం

-మాట ఇచ్చినట్టుగానే మంచి పాలన అందిస్తున్నాం -15శాతం వృద్ధితోనే స్వర్ణాంధ్ర-2047 సాధ్యం -ప్రతీ అధికారి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి -గౌరవభావంతో సంక్షేమ పథకాలు అందించండి -ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ -జిల్లాల కలెక్టర్ల తొలిరోజు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే… దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం …

Read More »

జిల్లాల ఆదాయంలో అనూహ్య మార్పులు – కలెక్టర్లకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2022-23 సంవత్సరానికి గాను సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం 2,19,234 రూపాయలు, అనంతపురం జిల్లాలో 2,33,521 రూపాయలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,93,763 రూపాయలుగా నమోదైంది. సాధారణంగా అనంతపురం జిల్లా కరువు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణించబడుతుంది. అయితే, కోనసీమలో తలసరి ఆదాయం ఎక్కువుగా ఉంటుందని భావిస్తారు. ఉద్యానవన రంగంలో …

Read More »

ప్రైవేటు భూములేవీ 22ఏలో ఉండ‌కూడ‌దు

-పేద‌లకు న్యాయం చేయాల‌న్న‌దే సీఎంగారి త‌ప‌న‌ -22ఏ, ఫ్రీహోల్డ్ భూముల‌పై ప్ర‌త్యేక డ్రైవ్‌ -జిల్లాల్లో ప్ర‌త్యేకంగా రియ‌ల్ ఎస్టేట్ క‌మిటీల ఏర్పాటు -భూ స‌మ‌స్య‌ల‌పైన క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి సారించాలి -రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22ఏలో ఉండ‌కూడ‌ద‌నేదే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌ని, ఆ దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాల‌ని రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. ప్ర‌జ‌ల‌కు …

Read More »

ఇఫ్తార్ విందులో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరీముల్లా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా  ysrcp నేత పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు కు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యాలకల చలపతి రావు, LRK, దాడి జగన్,  మండల శ్రీను, శ్యామ్, షాహీనా టీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు అమరావతి చిత్రకళ వీధికి మద్దతు – ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉండి ఎమ్మెల్యే మరియు ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, అమరావతి చిత్రకళ వీధికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తో కలిసి, ఈ గొప్ప కళా ఉత్సవాన్ని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ అనేక కళా రూపాలకు నిలయంగా ఉంది. ఇలాంటి వేదికలు కళాకారులను ప్రోత్సహించడానికి ఎంతో అవసరం. మన కళారూపాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అందరం కృషి చేయాలి.” …

Read More »

ఈ నెల 31 లోపు ఆస్థి పన్ను బకాయిలు చెల్లించండి- వడ్డీలో 50 శాతం రాయితీని పొందండి

-అనురాధ, అడిషనల్ డైరక్టర్, పురపాలక శాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్థి పన్ను బకాయిలు ఈ నెల 31 లోపు చెల్లించాలని, గడువు లోపు ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ అడిషినల్ డైరక్టర్ సి. అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో అనగా మొదటి అర్థ సంవత్సరానికి జూన్, రెండవ అర్థసంవత్సరానికి డిసెంబర్ లోపు పన్ను …

Read More »

ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్ లు పున:ప్రారంభం

-డా. ఎ. సిరి, ఐఏఎస్, డైరక్టర్, సెకండరీ హెల్త్ శాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సదరం స్లాట్ లు ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరక్టర్ డా. ఎ సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్వాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్ లు నిలిపివేయబడ్డాయన్నారు. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు, వెరిఫికేషన్ తో పాటు స్లాట్ లను తిరిగి ప్రారంభించి, అర్హులైన వారికి సర్టిఫికెట్లు …

Read More »

ఉప సర్పంచ్ ఎన్నికల నిమిత్తం ఓరియంటేషన్ ప్రోగ్రాం :ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లావణ్య కుమారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఉప సర్పంచ్ ఎన్నికల నిమిత్తము ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈనెల 27వ తారీఖున జరగనున్నఉపసర్పంచ్ ఎన్నికలు,జరుగు గ్రామ పంచాయితీల ప్రిసైడింగ్, అధికారులు మరియు డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమం లో, సూచనలు సలహాలు ఎలా నిర్వహించాలి అనే పలు అంశాలపై,డివిజనల్ పంచాయతీ అధికారి, జి ఎల్ ఎల్ వి ఎన్ రాఘవన్ ,మరియు జిల్లా పంచాయతీ అధికారి, సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది …

Read More »

చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం -త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు -ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి -మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు -ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి …

Read More »