Breaking News

Monthly Archives: March 2025

17 మందికి కారుణ్య నియామక పత్రాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ విధులు బాధ్యతాయుతంగా అంకితభావంతో నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నగరంలోని వారి చాంబర్లో 17 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అందులో 12 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, మరో 5మంది టైపిస్టులుగా నియమించబడ్డారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మంది విధి నిర్వహణలో ఉంటూ మరణించడంతో వారి వారసులకు నియామక పత్రాలు అందజేసినట్లు జడ్పీ చైర్ పర్సన్ వివరించారు. కొత్తగా నియమించబడిన …

Read More »

గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ శిక్షణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణను ప్రైవేటు శిక్షణ సంస్థలను గుర్తించి వాటి ద్వారా శిక్షణ ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. మరియు “జ్ఞానభూమి పోర్టల్ మరియు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్స్ సర్వీస్ కూడా ప్రారంభించుట జరిగినది. డైరెక్టర్ అఫ్ సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ఆదేశముల …

Read More »

గుంటూరులో చిల్లీ కాంక్లేవ్ పేరిట ఒక పెద్ద స‌ద‌స్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రాధాన్యతమైన వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండస్ట్రీ రంగం, సర్వీస్ రంగాల్లో 2025 – 26 సంవత్సరానికి 15 శాతం వృధ్ది లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించటం జరిగిందని, వ‌చ్చే సెప్టెంబ‌రులో గుంటూరులో చిల్లీ కాంక్లేవ్ పేరిట ఒక పెద్ద స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నామ‌ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 3వ కలెక్టర్ సమావేశంలో బుధవారం రెండవ రోజు …

Read More »

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్పీ శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖలుసంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్పీ శిక్షణ ఇచ్చుటకు నిర్ణయం జరిగింది. ఈ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన శిక్షణ సంస్థల యందు మరియు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న Study Circles నందు నిర్వహించబడుతుంది. అయితే ఈఉచిత డీఎస్పీ శిక్షణ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన SC & ST అభ్యర్థుల జాబితాలు జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌ మరియుhttps://mdfc.apcfss.inల యందు …

Read More »

గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై సెర్ప్అధికారులకు శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రైతు సాధికార సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బి. రామారావు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, సెర్ప్ సంస్థల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తోందని, జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమ అమలు లో భాగంగా మేనేజ్ జాతీయ సంస్థ ఆర్థిక సహకారంతో …

Read More »

లేఔట్ క్రమబద్దీకరణ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుటకు ఈ నెల 31 వరకు మాత్రమె గడువు….

-లేఔట్లు, ప్లాట్లు మరియు అనధికార కట్టడాలు క్రమబద్దీకరించుకొనుటకు లేఔట్ క్రమబద్దీకరణ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుటకు ఈ నెల 31 వరకు మాత్రమె గడువు….కమిషనర్ పులి శ్రీనివాసులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అనధికార లేఔట్లు, ప్లాట్లు మరియు అనుమతి లేకుండా మరియు అనుమతి పొందిన ప్లానుకు భిన్నంగా నిర్మించిన భవన సముదాయాలను లేఔట్ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుకొనుటకు ఈ నెల మార్చి 31వ తేదీ వరకు మాత్రమె గడువు కలదని …

Read More »

భవనాల యజమానులతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా జిఎంసి చేపట్టిన 120 అడుగుల రోడ్ విస్తరణలో ప్రభావితమయ్యే భవనాలకు నష్ట పరిహారం, స్తలాలకు టిడిఆర్ బాండ్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిస్తామని, ఎన్నో ఏళ్ల గుంటూరు నగరవాసుల కల అయిన ఆర్ఓబి నిర్మాణంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం వలన ప్రభావితమయ్యే భవనాల యజమానుల్లో …

Read More »

త్రాగునీటి పైప్ లైన్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో త్రాగునీటి పైప్ లైన్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, త్రాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ పెద్దపలకలూరు, అడవితక్కెళ్లపాడు, నాయిబ్రాహ్మణ కాలనీ, నల్లపాడు, రాజీవ్ గాంధీ నగర్, వల్లూరివారితోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని …

Read More »

ఆస్తి పన్ను చెల్లించడానికి కేవలం 5 రోజులే గడువు, ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2024–25 సంవత్సరము ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (5 రోజులే) గడువు ఉందని, పన్ను బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం దృష్ట్యా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. …

Read More »

జిఎంసి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 27న (గురువారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. …

Read More »