Breaking News

Monthly Archives: March 2025

జిఎంసి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 27న (గురువారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు గ్రీవెన్స్ నిర్వహించనున్నామని తెలిపారు. …

Read More »

ఔట్ ఫాల్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవుట్ ఫాల్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టికిల్ రోడ్, పినమనేని పాలీ క్లినిక్ రోడ్, కృష్ణవేణి రోడ్, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జరుగుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని రానున్న వర్షాకాలంలో, వర్షపు నీటి …

Read More »

మార్గ‌ద‌ర్శి – బంగారు కుటుంబం

-ఉగాది రోజున‌ సీఎం చేతుల మీదుగా ప్రారంభం -పేద‌రిక ర‌హిత ఏపీ సాధనే ల‌క్ష్యంగా పీ4 కార్య‌క్ర‌మం -సంప‌న్న‌వ‌ర్గాలు నిరుపేద కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేలా రూప‌క‌ల్ప‌న‌ -ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది పండ‌గ రోజున మార్గ‌ద‌ర్శి- బంగారు కుటుంబం అనే వినూత్న కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించ‌బోతున్న‌ట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ తెలిపారు. స‌చివాలయంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో భాగంగా ఆయ‌న …

Read More »

9 నెల‌ల్లో ఉద్యోగుల‌కు రూ.7230 కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేశాం

-గ‌త ప్ర‌భుత్వం రూ.20,637 కోట్ల బ‌కాయిలు పెట్టేసింది -ఉద్యోగులు కూడా ప్ర‌భుత్వంలో భాగ‌మే -అందుకే ఇబ్బందులున్నా వారి బ‌కాయిలు విడుద‌ల చేశాం -సౌల‌భ్యాన్ని బ‌ట్టి మిగిలిన బ‌కాయిలు విడుద‌ల చేస్తాం -క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డి -పీ4లో ఉద్యోగ కుటుంబాలు భాగ‌స్వామ్యం కావాలని పిలుపు -ప్ర‌తి కుటుంబానికి ఇంటి స్థ‌లం ఉండేలా చూడాల‌ని ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గ‌త ప్ర‌భుత్వం చెల్లించ‌కుండా ఎగ్గొట్టిన బ‌కాయిల్లో రూ.7230 కోట్లు బ‌కాయిలు ప్ర‌స్తుతం విడుద‌ల …

Read More »

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మంచినీటి స‌మ‌స్య లేకుండా చ‌ర్య‌లు

-నీటి స‌ర‌ఫ‌రాల‌పై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం -అన్ని బోర్లు ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాం -మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో నీటిస‌ర‌ఫ‌రాపై క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాలి -పుర‌పాల‌క‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో ఎక్క‌డా కూడా మంచినీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా అన్నిర‌కాల ఏర్పాట్లు చేశామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్లు మున్సిపాల్టీలు, న‌గ‌రాల్లో మంచినీటి స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. జిల్లా …

Read More »

లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో వ్యవహరిస్తూ సీజనల్ వ్యాధులను నియంత్రించాలి

-తగినన్ని నిధులు ఇస్తాము, సీజనల్ వ్యాధులు ప్రబలటానికి వీల్లేదు -అవసరమైన చోట్ల డ్రోన్ల సహాయాన్ని వినియోగించుకోవాలి -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అంశంపై ఆయన మాట్లాడుతూ …

Read More »

వేస‌విలో మంచినీటి స‌మ‌స్య క‌నిపించ‌కూడ‌దు

-వేస‌వి పూర్త‌య్యే వ‌ర‌కు జిల్లాల్లో కాల్ సెంట‌ర్లు పెట్టుకోండి -త‌గిన ఏర్పాట్లు చేసుకోండి -నీళ్ల స‌మ‌స్య‌ల‌పై జీపీఎస్ – రియ‌ల్ టైమ్ ప‌ర్య‌వేక్ష‌ణ చేయండి -జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వేస‌విలో ఎక్క‌డా కూడా మంచినీటి స‌మ‌స్య‌లు లేకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలిచ్చారు. వేస‌వి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాలు ఎక్క‌డైనా స‌రే మంచినీళ్ల కోసం ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితి …

Read More »

సేవ‌ల‌పై సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలి

-ఐవీఆర్ ఎస్ స‌ర్వే నివేదిక‌లిస్తున్నాం -ఎక్క‌డెక్క‌డ వ‌నెక‌బ‌డ్డామో తెలుసుకుని అక్క‌డ ప‌రిస్థితులు మెరుగ‌య్యేలా చేయాలి -క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచార పౌర‌సంబంధాల శాఖ సంచాల‌కులు హిమాన్షు శుక్లా సూచ‌న‌ -పీపుల్స్ పెర్‌సెప్ష‌న్స్‌పై క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ప్ర‌జెంటేష‌న్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌లు కార్య‌క్ర‌మాలపై ప్ర‌జ‌ల్లో మ‌రింత సంతృప్తి స్థాయి పెంచేలా జిల్లాల్లో యంత్రాంగం ప‌నిచేయాల‌ని ఆ దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు కృషి చేయాల‌ని రాష్ట్ర స‌మాచార పౌర‌సంబంధాల శాఖ సంచాల‌కులు హిమాన్షు శుక్లా అన్నారు. స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో …

Read More »

పిఠాపురంలో ఆర్వోబీ నిర్మాణానికి అనుమతి : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. రైల్వే భద్రత పనుల కింద రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా సేతుబంధన్ – కేంద్ర రోడ్లు మౌలిక సదుపాయాల నిధి (CRIF) పథకం కింద కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ …

Read More »

గ్రీవియెన్స్ రిడ్రస్సల్ విధానంపై సమీక్ష….

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సియం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏడాది జూన్ 15 నుండి ఈనెల 19 వరకు రాష్ట్రంలో మొత్తం 8లక్షల 26వేల ఫిర్యాదులు రాగా వాటిలో ఇప్పటి వరకు 7లక్షల 22వేల ఫిర్యాదులు పరిష్కరించారని అన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల్లో 6 లక్షల 99వేలు విత్ ఇన్ ఎస్ఎల్ఏ,22వేల 770 బియాండ్ ఎస్ఎల్ఏ లో పరిష్కరించారని తెలిపారు. ఫిర్యాదులను కేవలం రొటీన్ విధానంలో పరిష్కరించడం కాకుండా ఆ సమస్యను శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా క్వాలిటీ డిస్టోజల్ ఉండాలన్నారు.కావున జిల్లా …

Read More »