Breaking News

Daily Archives: June 8, 2025

నిస్వార్థ సేవకు నిదర్శనం ఆచార్య ఎన్.జి.రంగా..ఆయ‌న చ‌రిత్ర ఒక స్పూర్తి : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఆచార్య రంగా న‌గ‌ర్ లో ఆచార్య ఎన్.జి రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ -విగ్ర‌హావిష్క‌ర‌ణ చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మెహ‌న్ -ఆచార్య ఎన్.జి రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే ఘ‌న నివాళి -ఆచార్య రంగా న‌గ‌ర్ లో రూ.37 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు -రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దెరామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీరంగా నిదర్శనం. ఆయ‌న చ‌రిత్ర రాజ‌కీయ నాయ‌కుల‌కు …

Read More »

పూర్ణానంద పేట లో సి. కె. గ్రాండ్ అండ్ హోటల్ అభి ప్రారంభోత్స‌వం

-వ్యాపార‌స్తుల‌కు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంది : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వంలో వ్యాపార‌స్తులు వ్యాపారం చేయ‌టానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వుండేది..ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథం వైపు ప‌య‌నిస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పూర్ణానంద పేట రైల్వే హాస్పిటల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన సి. …

Read More »

ఆధునిక భార‌త‌దేశ నిర్మాణంలో స్పూర్తి వంత‌మైన సేవ‌లు అందించిన నేత బాబూ జ‌గజ్జీవ‌న్ రామ్

-మాజీ ఉప ప్ర‌ధాన మంత్రి బాబూ జ‌గజ్జీవ‌న్ రామ్ సేవ‌లు కొనియాడిన నేత‌లు -ముఖ్య అతిథులుగా హాజ‌రైన ప‌ద్మ‌శ్రీ మందా కృష్ణ మాదిగ‌, ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు -కృష్ణ‌లంక రాణిగారి తోట‌లో బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అటు స్వాతంత్రోధ్య‌మంలో మ‌హాత్మ‌గాంధీకి, ఇటు రాజ్యాంగ ర‌చ‌న డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ కి చేదోడు వాదోడు వుంటూ స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం కృషి చేసిన మ‌హనీయుడు మాజీ ఉప‌ప్ర‌ధానమంత్రి బాబు జ‌గ‌జ్జీవ‌న్ రామ్, …

Read More »

ఐదుగురు సచివాలయ సిబ్బంది తో కూడిన బృందాన్ని నియామకం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మండల స్థాయి విజన్ కార్యాచరణ ప్రణాళిక జూన్ 9 వ తేదీ ఆయా నియోజక వర్గ మండల ప్రధాన కేంద్రంగా నియోజక వర్గ అభివృద్ధి సూచికలకు చెందిన ఐదుగురు సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ ను నియోజక వర్గ శాసన సభ్యులు సమక్షంలో సిద్ధం చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జూన్ 9 వ తేదీన ఆమేరకు భవిష్యత్ కార్యాచరణ …

Read More »

యోగాంధ్ర కార్యక్రమం పై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకుని వెళ్లడం, రిజిస్ట్రేషన్ చెయ్యడం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి యోగాంధ్ర పై జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు క్షేత్ర స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, జిల్లాలో …

Read More »

ఇంటర్, పదవ తరగతిలో 172 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్

-అవార్డ్ ప్రధానం కోసం శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో ఏర్పాట్లు -డి వి ఈ వో .. కే వాసుదేవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో 48 మంది ఇంటర్, 124 మంది పదవ తరగతి విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పరిధిలో షైనింగ్ స్టార్స్ – ప్రతిభా అవార్డులు జూన్ 9 వ తేదీ న అందచేయడం జరుగుతోందని జిల్లా పాఠశాల విద్యాధికారి కే. వాసుదేవరావు తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీ త్యాగరాజ నారాయణ దాస …

Read More »

ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …

Read More »

వృద్ధాశ్ర‌మాల్లో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మందికి యోగాస‌నాలు నేర్పించాల‌నే ల‌క్ష్యంతో నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇదే విధంగా ఎన్‌టీఆర్ జిల్లాలో క‌నీసం ప‌ది ల‌క్ష‌ల మందికి యోగాను నేర్పించేందుకు గ్రామ‌, వార్డు స‌చివాల‌యం స్థాయిలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. ప్ర‌తి వ‌ర్గాన్ని యోగాంధ్ర‌లో భాగంచేసే ల‌క్ష్యంతో థీమ్ యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. భార‌త‌దేశ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాను స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికి …

Read More »

కృష్ణా తీరం.. యోగా త‌రంగం..

– హ‌రిత బెర్మ్ పార్కులో యోగాంధ్ర కార్య‌క్ర‌మం – పెద్దఎత్తున పాల్గొన్న యోగా ఔత్సాహికులు – ఒక్క మాస‌మే కాదు.. ప్ర‌తిరోజూ యోగా సాధ‌న చేయాలి – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భానుని లేలేత కిరణాలు ప్ర‌కృతిని ప‌ల‌క‌రించే వేళ‌.. కృష్ణ‌మ్మ చెంత హ‌రిత బెర్మ్ పార్కులో జ‌రిగిన యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, యోగాను ఒక్క మాసానికే ప‌రిమితం చేయ‌కుండా ప్ర‌జ‌లు ప్ర‌తిరోజూ కొంత స‌మ‌యాన్ని యోగాస‌నాల‌కు కేటాయించి, ఆనంద‌మ‌య జీవితాన్ని …

Read More »

యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి

-ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో మొదలుపెట్టిన యోగాంద్ర కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించే క్రమంలో, యోగ వల్ల ప్రజలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించేటట్టు నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం శాఖధిపతులు, స్పెషల్ ఆఫీసర్లు, సిబ్బంది తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ …

Read More »