Breaking News

Monthly Archives: July 2026

పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఎంపీ గురుమూర్తి లేఖకు కేంద్రం స్పందన

-రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగానే వివరాలు వెల్లడించిన కేంద్రం -క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్య న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పరిశుభ్రత వంటి అంశాలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై ఎంపీ చేసిన సూచనలను పరిశీలించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని …

Read More »

నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలి

-తిరుపతి పార్లమెంటు పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలి -లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు రహదారులు తిరుపతి …

Read More »

రైతులకు రూ.5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి.. కేంద్రం వెల్లడి

-జిల్లాల వారీగా కేసీసీ జారీ, రుణాల పంపిణీ వివరాలను పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం -కిసాన్ క్రెడిట్ కార్డులపై లోక్ సభ లో ఎంపీ కేసినేని చిన్ని కీలక ప్రశ్న -లోక్‌సభలో విజయవాడ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (KCC) జారీ, వాటి ద్వారా అందుతున్న పంట రుణాలు, సత్వర రుణ చెల్లింపు ప్రోత్సాహకాలు (Prompt Repayment …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ఎంపీ చిన్ని

-ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల తృతీయ స్థాయి వైద్యశాలగా మరియు ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఎంపీ చిన్ని విజ్ఞప్తి -ఇటీవల ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు సిబ్బంది అవసరాలపై చర్చించిన ఎంపీ చిన్ని -ఆసుపత్రిలో చర్చించిన అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత తెస్తానని హామీ -ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియా ని కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి ని 300 పడకల తృతీయ స్థాయి వైద్యశాల మరియు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ చిన్ని …

Read More »

భవిత్ సేవలు అభినందనీయం

-సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తు కోసం పాటుపడుతున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ప్రముఖ సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. సోమవారం భవానిపురం, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్

-బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోందని బీజేపీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి అన్నారు. సోమవారం, భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ …

Read More »

నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్నిసమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన ప్రణాళిక సిద్దం చేశామని, నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంకు సహకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఆగస్ట్ 15 నుండి గుంటూరు నగరంలో అమలు చేయనున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పై అవగాహన కల్గించడానికి, శాఖలు, …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి …

Read More »

డ్ల విస్తరణ పనులను నిర్దేశిత ‘రైట్ ఆఫ్ వే’ మేరకు వేగవంతంగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణ పనులను నిర్దేశిత ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్ఓడబ్ల్యు) మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులపై పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

స‌ర్‌.. స‌ర్వేలో మీ స‌హ‌కారం భేష్‌!

– మున్ముందు ఇదే స‌హ‌కారాన్ని అందించండి – ఈ నెల 31వ తేదీన ఓట‌ర్ల జాబితా ముసాయిదా ప్ర‌చుర‌ణ‌ – ఈ నెల 31 నుంచి ఆగ‌స్టు 30 వ‌ర‌కు క్లెయిములు, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ – ప్ర‌తి ద‌ర‌ఖాస్తును అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌రిష్క‌రిస్తాం – అక్టోబ‌ర్ 3వ తేదీన తుది జాబితా ప్ర‌చుర‌ణ‌ – రాజ‌కీయ పార్టీల స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) …

Read More »