Breaking News

Monthly Archives: July 2026

మెగా డీఎస్సీపై ఆరోపణలు కాదు రుజువులు చూపించు

-జగన్ పై మంత్రి సవిత ఫైర్ -చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఎద్దేవా -కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న వైసీపీ -బీసీ గర్జన పేరుతో మరో డ్రామా -జగన్ శవ రాజకీయాలపై ప్రజల్లో విసుగు -స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి వైసీపీకి గుణపాఠం ఖాయం : మంత్రి సవిత -గిద్దలూరులో ఇంటింటికీ తెలుగుదేశం -ప్రభుత్వ పథకాలు, అభివృద్ధినిపై వివరించిన మంత్రి -కూటమి పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందనపై మంత్రి సవిత హర్షం గిద్దలూరు/మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీపై ఆరోపణలు కాదు రుజువులు …

Read More »

పీహెచ్‌సీల పనితీరుకు ‘ఆరోగ్య ఫలితాలే’ ప్రామాణికం

-సేవల సంఖ్య ఆధారిత ర్యాంకుల విధానానికి స్వ‌స్తి -మాతా శిశు ఆరోగ్యం నుంచి ప్రజల సంతృప్తి వరకు 21 అంశాల ప‌నితీరు ఆధారంగా మార్కులు -మాతృత్వ మరణాలు, సిజేరియన్లు తగ్గిన ఆసుపత్రులకు ర్యాంకింగ్ లో ప్రాధాన్యం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పనితీరు మదింపులో కూటమి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంతమంది రోగులకు సేవలందించారు? ఎన్ని పరీక్షలు చేశారు? ఎన్ని ప్రసవాలు నిర్వహించారు? అనే లెక్కలను …

Read More »

అంటువ్యాధుల వ్యాప్తి క‌ట్ట‌డికి ఆర్.ఆర్‌.టిల‌ మ‌రింత ప‌టిష్టం

-హెచ్చ‌రిక‌ల‌తోనే అప్ర‌మ‌త్తం కావాలి -ఘ‌ట‌నా స్థ‌లాల‌కు గంటల వ్య‌వ‌ధిలోనే చేరుకోవాల‌ని బోధనాసుప‌త్రుల‌కు డిఎంఈ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు, అంటువ్యాధులు(Disease Outbreaks and Epidemics) ప్రబలినప్పుడు ప్రజలకు వేగంగా వైద్యసేవలు అందించడంతోపాటు వ్యాధి వ్యాప్తిని తొలిదశలోనే అడ్డుకునేందుకు డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్(డిఎంఈ) ముందస్తు చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ మెడిసిన్‌, సూక్ష్మజీవశాస్త్రం, జనరల్‌ మెడిసిన్‌ నిపుణులతో రాష్ట్రస్థాయి సత్వర స్పందన బృందాన్ని(Rapid Response Teams) ఏర్పాటు చేసింది. దీనికనుగుణంగా ప్ర‌తి బోధనాసుప‌త్రిలో ఇటువంటి బృందాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని …

Read More »

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి

-రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే సంక్షేమం అందిస్తున్నాం -మాట‌కు క‌ట్టుబ‌డి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల‌కు పెన్ష‌న్ పెంపు -కుటుంబంలో చ‌దువుకునే పిల్ల‌లంద‌రికీ త‌ల్లికి వంద‌నం -నిరంత‌ర విద్యుత్ తో పాటు ట్రూ డౌన్ ఘ‌న‌త కూట‌మిదే -ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన …

Read More »

గ్రామీణ మహిళలకు ఉచితంగా ఆయిస్టర్ మష్రూమ్ సాగులో శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల (అటానమస్), “సుస్థిరమైన ఆయిస్టర్ మష్రూమ్ సాగు మరియు పారిశ్రామికీకరణ ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత” అనే అంశంపై ఐదు రోజుల ఉచిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శాస్త్రీయ ఉత్పత్తి పద్ధతులు, స్పాన్ ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ మరియు వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమంతో సహా ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగులో ఆచరణాత్మక శిక్షణను అందిస్తుంది. ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్న్యాసమ్మ గాడే, కరస్పాండెంట్ డా. సిస్టర్ లీనా క్వాడ్రాస్ …

Read More »

కేజీబీవీ అధ్యాపకులకు ఖాన్ అకాడమీ వినూత్న శిక్షణ

-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., -సమగ్ర శిక్ష, ఖాన్ అకాడమీ ఇండియా మధ్య ఒప్పందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సమగ్ర శిక్ష, ప్రముఖ స్వచ్ఛంద విద్యా సంస్థ ‘ఖాన్ అకాడమీ ఇండియా’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఖాన్ అకాడమీ ఇండియా గవర్నమెంట్ పార్ట్‌నర్‌షిప్స్ …

Read More »

ఆర్టీసి ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్శింగు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి…

-ఆర్టీసి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాలని”చలో విజయవాడ” భారీ ధర్నా -ఆర్టీసిలో ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ఉధ్యోగభధ్రత కల్పించాలి -ఏఐటియుసి రాష్ట్రప్రధానకార్యదర్శి యస్.వెంకటసుభ్భయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ (పి.టి.డి) లో వివిధ కేటగిరీలలో 26 జిల్లాల నుంచి సుమారు 8,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు చెల్లిస్తున్న నేపథ్యంలో వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కుల అమలులో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే ఆర్టీసి …

Read More »

నగరంలో ఆగస్టు 6 నుండి ‘కళా ఉత్సవ్’ కార్యక్రమం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 6, 7 మరియు 9 తేదీలలో “కళా ఉత్సవ్” పేరిట మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నారు. శివ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారి దివ్య ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్, రాధాకృష్ణ కళాక్షేత్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయని కనకదుర్గ గుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) తెలిపారు. సోమవారం గాంధీనగర్ …

Read More »

ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో తొలి ఏకాదశిని మొదటి పండుగగా భావిస్తారు. దీంతో 2026లో తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమయ్యాయని పురోహితులు తెలిపారు. ఈనెల 29న గురు పూర్ణిమ, AUG 18న మంగళ గౌరీ పూజ, 21న వరలక్ష్మీ వ్రతం, 28న రాఖీ పౌర్ణమి జరగనున్నాయి. అలాగే SEP 4న శ్రీకృష్ణాష్టమి, 14న వినాయక చవితి, OCT 20న దసరా, NOV 8న దీపావళి, DEC 20న ముక్కోటి ఏకాదశి పండుగలను జరుపుకోవాలని సూచించారు.

Read More »

యువతకు స్ఫూర్తి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం… : ఎమ్. ఎస్ బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీ నందు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కలాం దేశాభివృద్ధి దృక్పథం, విజ్ఞాన శాస్త్రానికి చేసిన అపూర్వ సేవలు, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాల గురించి వివరించారు. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకునే వరకు ఆగకండి …

Read More »