గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన వి. కరుణ , ఐ.ఏ.ఎస్ సోమవారం మధ్యాహ్నం కలక్టరేట్ ను సందర్శించారు. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ గారు ఎన్నికల పరిశీలకుల వారికి పుష్పగుచ్చం అందించి నామినేషన్ల స్వీకరణ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ సందర్భంగా వివరించారు.
Prajavartha Online Telugu News