విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు అభివర్ణించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి, సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐ వి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పెహల్గాం లో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. …
Read More »Daily Archives: April 26, 2025
అన్నక్యాంటీన్లలో నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం మిర్చి యార్డ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో మౌలిక వసతుల కల్పన కీలకమని, ప్రతి క్యాంటీన్ లో త్రాగునీరు, హ్యాండ్ వాష్ కి నీరు అందుబాటులో ఉంచేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్యాంటీన్లలో …
Read More »ట్రాఫిక్ కి అడ్డంకిగా ఉండే వాటిని తొలగించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్లపై వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ కి అడ్డంకిగా ఉండే వాటిని తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ నెహ్రు నగర్, రాజీవ్ గాంధీ నగర్, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన రోడ్ల …
Read More »సెలవు రోజుల్లోనూ (ఆదివారం) పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు …
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీకి మరో 4 రోజులే గడువు ఉందని, నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు ఆదివారం సెలవు రోజైనప్పటికీ పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ …
Read More »జిఎంసి మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28న (సోమవారం) గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగనున్నాయని, ఎన్నికల సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు పిజిఆర్ఎస్, డయల్ …
Read More »వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయడానికి వీలు లేదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయడానికి వీలు లేదని, అలా వేసే ట్యాంకర్లను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు నగరంలోని సెప్టిక్ ట్యాంకర్ల యజమానులు, కాంట్రాక్టర్లతో శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యెక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ సఫాయి …
Read More »మే 15 గుంటూరు మెగా జాబ్ మేళా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో మే 15వ తేదీలోపు నిర్వహించనున్న గుంటూరు మెగా జాబ్ మేళాకు ఈ నెల 30 (బుధవారం) స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తుది అవగాహన సదస్సు జరుగుతుందని, రిజిస్టేషన్ చేసుకున్న నిరుద్యోగ యువత తప్పనిసరిగా హాజరు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో జిల్లాలో 10వ తరగతి పైన చదివిన నిరుద్యోగ …
Read More »NTR జిల్లా లో రబీ పంట కాలమునకు జిల్లాలో కేటాయించినా మొత్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : RSK లు -107 ఉన్నవి ధాన్యము కొనుగోలు టార్గెట్ – 50,000 MTs జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు జిల్లా లోని ధాన్యము కోనుగోలు కేంద్రాల తేదీ: 02.04.2025 న నుండి ప్రారంభము అయినవి. గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ లో సమకూర్చబడ్డాయి తిరువూరు డివిజన్ – 5,17,280 విజయవాడ డివిజన్ – 6,25,700 నందిగామ డివిజన్ – 2,56,604 Total 13, 99,584 గోనె సంచులతో పాటు RSK ల నందు …
Read More »విజయవాడ బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు అనూహ్య స్పందన..
-వినూత్న ఆలోచనలతో ఇప్పటికే 200కు పైగా ఎంట్రీలు.. -ఔత్సాహికులకు మరో అవకాశం, మే 10 వరకు ఎంట్రీలకు చివరి తేదీ.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నవ్య రాజధాని అమరావతికి గేట్వే నగరమైన విజయవాడకు గుర్తింపు తెచ్చేందుకు నిర్వహించిన బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, వినూత్న ఆలోచనలతో నూతన ఒరవడిని జతచేసి 200 మందికి పైగా తమ ఎంట్రీలను పంపారని, ఔత్సాహికులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎంట్రీలకు …
Read More »దివ్యాంగుడిని గౌరవించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు. ఆర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »
Prajavartha Online Telugu News