Breaking News

Monthly Archives: July 2026

నిర్దేశిత గడువు 2027 లోపలే పోలవరం పూర్తి.

-షెడ్యూల్ ప్రకారమే చకచకా పనులు. -ఎల్‌నినో, సుపర్ ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు. -రేపు పట్టిసీమ, తాటిపూడి పంప్ హౌస్‌ ల మోటార్లు ఆన్ చేస్తున్నాం. -పోలవరం పనులను క్షేత్రస్దాయిలో పరిశీలించిన మంత్రి నిమ్మల పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించిన రీతిలో షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్దాయిలో పరిశీలించి, అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి …

Read More »

జిల్లాలో 59.47 శాతం ఫారాల డిజిటైజేష‌న్‌..

– ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో సాఫీగా స‌ర్ ప్ర‌క్రియ‌ – ఓట‌ర్ల స‌హాయార్థం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న హెల్ప్ డెస్కులు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం సాఫీగా కొన‌సాగుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 59.47 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చిట్టిన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. నియోజ‌కవ‌ర్గంలో ఏర్పాటు చేసిన ఓట‌రు …

Read More »

శాస్త్రీయ‌, క‌చ్చిత స‌మాచారంతో నివేదిక‌..

– డెడికేటెడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ రాజీవ్ రంజ‌న్ మిశ్రా – బీసీల సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేక దృష్టి – ఉన్న‌త విద్య‌, నైపుణ్యాభివృద్ధి వంటి కీల‌క అంశాల‌పైనా స‌మీక్షించిన క‌మిష‌న్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు, వాటి ప్ర‌భావం, ప్ర‌జాప్రాతినిధ్యం త‌దిత‌ర అంశాల‌పై వివిధ వ‌ర్గాలు అందించిన స‌మాచారంతో పాటు స‌మ‌కాలీన, అనుభ‌వాధారిత విచార‌ణ ఆధారంగా శాస్త్రీయ‌, క‌చ్చిత స‌మాచారంతో నివేదిక రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని డెడికేటెడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ రాజీవ్ …

Read More »

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై చర్చించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి, స్కౌట్స్ …

Read More »

సహకార బ్యాంకింగ్‌లో ఉత్తమ విధానాల అధ్యయనానికి అమృత్‌సర్ పర్యటనలో మాజీ మంత్రి, కృష్ణా డీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార బ్యాంకింగ్ రంగంలో ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న బ్యాంకింగ్ సేవలు మరియు సంస్థాగత సామర్థ్యాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC బ్యాంక్) చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు  నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ డీసీసీ బ్యాంకుల చైర్మన్ల ప్రతినిధి బృందంతో కలిసి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్‌సర్ డీసీసీ బ్యాంకు యాజమాన్యంతో …

Read More »

జాయింట్ కలెక్టర్‌ను జిల్లా వక్ఫ్ అధికారిగా నియమించండి…

– ప్రభుత్వాన్ని కోరిన ఏపీ వక్ఫ్ బోర్డు – వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో పరిపాలన మరింత బలోపేతం కావాలి – ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, న్యాయపరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో వక్ఫ్ పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న …

Read More »

దివ్యాంగుల సాధికారతకు జాతీయ పురస్కారాలు – 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సాధికారతకు జాతీయ పురస్కారాలు – 2026 కు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల ఆహ్వానం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) ఆధ్వర్యములో, దివ్యాంగుల సాధికారత రంగములో విశిష్ట సేవలు అంధించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు–2026 కొరకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు తెలియజేసినారు. దివ్యాంగుల జీవితాల్లో గణనీయమైన మార్పు …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఉద్యోగుల వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం – ఏపీ ఎన్‌జీజీవో నాయకులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను సానుకూల దృక్పథంతో పరిశీలించి ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లపై ఏపీ జే ఏ సి జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జే ఏ సి …

Read More »

సమాజ విధ్వంసకులకు అండగా జగన్ రెడ్డి నిలుస్తున్నారు… : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశపూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసంకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా …

Read More »

జూలై 14 వరకు సర్ ప్రక్రియ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. మంగళవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,50,765 ఫారాలను (99.49 శాతం) …

Read More »