– జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2026-27 విద్యాసంవత్సరానికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది పొందేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతాను ఎన్పీసీఐ పోర్టల్తో అనుసంధానం (లింక్) చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయని విద్యార్థుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్.. సమీప గ్రామంలోని పోస్టాఫీసులో ఇండియన్ పోస్ట్ …
Read More »Monthly Archives: July 2026
సమష్టికృషితోనే సర్ విజయవంతంగా..
– కార్యక్రమంలో వచ్చే నాలుగు రోజులు చాలా కీలకం – సహాయసహకారాల్లో ప్రత్యేక అధికారుల కృషి ముఖ్యం – జిల్లాలో 66.16 శాతం మేర ఫారాల డిజిటైజేషన్.. – ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో ఓటర్లకు సహాయసహకారాలు అందించడం ద్వారా ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని, కార్యక్రమంలో వచ్చే నాలుగు రోజులు చాలా కీలకమని జిల్లా …
Read More »ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్వోగా తలుపుల నాగేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించి, పదోన్నతిపై ఎన్టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు స్వీకరించిన తలుపుల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నూతన డీపీఆర్వోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రభుత్వం–ప్రజల మధ్య సమర్థవంతమైన వారధిగా కీలక …
Read More »పోషకాహారంతోనే విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్
– పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ ప్రసక్తే లేదు – ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు అందించే పోషకాహారమే వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్కు బలమైన పునాదిగా నిలుస్తుందని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి తావు ఉండరాదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం పెనుగంచిప్రోలులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన …
Read More »ఏపీఎయిమ్స్తో బహుళ ప్రయోజనాలు
– ప్రత్యేక యాప్ సేవలను సద్వినియోగం చేసుకోండి – ఎరువుల సరఫరాలో పారదర్శకతకు పెద్దపీట – ఉద్యాన, స్వల్పకాలిక వరి రకాలు, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని.. సమగ్ర వ్యవసాయ సాంకేతికత విధానాలతో అన్నదాతలు మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పెనుగంచిప్రోలులో పీఏసీఎస్, …
Read More »రామవరప్పాడులో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లకు …
Read More »పీసీపీఎన్డీటీ చట్టం అమలులో రాజీ లేదు… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను నిరోధించే పీసీపీఎన్డీటీ చట్టంను జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని, చట్ట నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం పోక్సో కోర్టు జిల్లా జడ్జి గాజుల వెంకటేశ్వర్లుతో కలసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీలు సహకరించాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ -ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై అవగాహన కల్పించిన కలెక్టర్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. బుధవారం గన్నవరం …
Read More »పేదలకు సరళీకృత పరిపాలన, రెవెన్యూ సంస్కరణలే ప్రభుత్వ లక్ష్యం
-ఉయ్యూరులో నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ తదితరులతో కలిసి ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదలకు హక్కులు కల్పిస్తూ, పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన ఉయ్యూరు తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని …
Read More »నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా సమగ్ర చర్యలు చేపడుతున్నాం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పలు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (National Clean Air Programme – NCAP) అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ సీఎస్ఐఆర్–నీరీ (CSIR–NEERI), అధికారులతో సమీక్ష …
Read More »
Prajavartha Online Telugu News