Breaking News

Monthly Archives: July 2026

అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి …

Read More »

ఆర్‌టీఐహెచ్‌లో ఫ్యాకల్టీ అంబాసిడర్‌లకు శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త దార్శనికతలో భాగంగా విజయవాడలోని ఎనికేపాడులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్‌) తన ప్రధాన కార్యక్రమమైన ఇన్నో-ట్రైబ్ (Inno-Tribe)** కింద ఫ్యాకల్టీ అంబాసిడర్‌లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రంలోని కళాశాలల్లో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకత సంస్కృతిని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణలో ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల నుంచి 40 …

Read More »

జూలై 7 న టీటీడి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

-8న ఆలయ వార్షికోత్సవం -ఆలయ అధీక్షకులు ఎం.మల్లికార్జున్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పున్నమ్మతోట లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో ఈ నెల 7 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం 8 న వార్షికోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధీక్షకులు ఎం. మల్లికార్జున్ తెలిపారు. ఇందులో భాగంగా టిటిడి ఆగమ సలహాదారు పరాశరం భావనారాయణ చార్యులు కంకణ భట్టార్ వరాహ వెంకట శశి కిరణ్ మరియు ఇతర రుత్వికులు సమక్షం లో ఈ నెల 7 వ …

Read More »

భారత్ మండపంలో ఘనంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5వ వార్షికోత్సవ వేడుకలు

-సహకార్ సే సమృద్ధి’ జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం  రఘురామ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని భారత్ మండపం, ప్రగతి మైదాన్ వేదికగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “సహకార్ సే సమృద్ధి – 5 స్వర్ణిమ్ సంవత్సరాలు: విజయాలు, నవకల్పనలు, వికసిత్ భారత్ దిశగా అడుగులు” అనే అంశంపై జాతీయ స్థాయి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కేంద్ర హోం వ్యవహారాలు మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య …

Read More »

ఈ నెల 15 నుంచి అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్‌

– జాతీయ క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హ‌ణ‌ – విజేత‌ల‌కు మొత్తం రూ. 91.90 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తులు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆగ‌స్టు 26 వ‌ర‌కు అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలు జ‌ర‌గ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. …

Read More »

ఇగ్నైట్‌తో స‌ర్ చైత‌న్యం..

– స‌హాయ కేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ ముమ్మ‌రంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలోని ఇగ్నైట్ సెల్‌లో స‌ర్ స‌హాయ కేంద్రాన్ని సోమ‌వారం ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ ప్రాధాన్య‌త‌ను వివ‌రించ‌డం, 2002 స‌ర్ జాబితాలో వివ‌రాలు చూసుకోవ‌డం, ఎన్యూమ‌రేష‌న్ ఫారాలను స‌రైన విధంగా నింపి, బీఎల్‌వోకు అందించ‌డం, డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ త‌దిత‌రాల‌పై ఓట‌ర్ల‌కు ఈ సెల్ ద్వారా అవ‌గాహ‌న‌తో పాటు స‌హాయ‌స‌హాకారాలు అందించ‌డం …

Read More »

నేడు (ఈ నెల 7న ) జిల్లాలో డెడికేటెడ్ క‌మిష‌న్ పర్య‌ట‌న‌

– లిఖిత‌పూర్వ‌క అభిప్రాయాలు స్వీక‌రించ‌నున్న గౌర‌వ రాజీవ్ రంజ‌న్ మిశ్రా – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి స్థానిక సంస్థ‌ల్లో రాజ‌కీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాల‌పై స‌మ‌కాలీన‌, అనుభ‌వాధారిత విచ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గౌర‌వ రాజీవ్ రంజ‌న్ మిశ్రా ఛైర్మ‌న్‌గా ఏర్పాటుచేసిన డెడికేటెడ్ క‌మిష‌న్ ఈ నెల 7న జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి …

Read More »

ప‌రిష్కారం ప‌ల‌క‌రిస్తే సంతోషం ప‌ర‌వ‌ళ్లు!

– అర్జీదారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయండి – పీజీఆర్ఎస్ సంతృప్తి స్థాయిలో జిల్లాను ముందంజ‌లో నిల‌పండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల స‌మ‌స్యకు అధికారులు ప‌రిష్కారం చూపిన‌ప్పుడు వారి ముఖంలో ఆనందం మ‌న కృషికి ద‌క్కిన ఫ‌లిత‌మ‌ని.. ప్ర‌జా స్నేహ పూర్వ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో వ‌చ్చే అర్జీల‌కు గ‌డువులోగా నాణ్య‌మైన ప‌రిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషిచేయాల‌ని జిల్లా కలెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి …

Read More »

స‌ర్ డిజిటైజేష‌న్ స‌జావుగా..

– జిల్లాలో 54.61 శాతం మేర పూర్త‌యిన ప్ర‌క్రియ‌ – నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో వేగ‌వంతానికి కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ‌లో భాగంగా ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని.. ఈ ప్ర‌క్రియ వేగ‌వంతానికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో, మార్గ‌నిర్దేశంతో కృషిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు నింపడంలో, సమర్పించడంలో సహాయం చేయడానికి అందుబాటులో ఉన్న హెల్ప్ డెస్కులను సద్వినియోగం చేసుకునేలా …

Read More »

శ్యామ ప్రసాద్ ముఖర్జీ కు ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125 వ జయంతి సందర్భంగా బూత్ కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. సోమవారం , హెచ్ బీ కాలనీ 10 వ నెంబర్ బూత్ పరిధిలో స్థానిక నాయకులందరూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.. జయంతి వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి …

Read More »