Breaking News

Monthly Archives: July 2026

‘తల్లికి వందనం’తో ఆర్థిక ఊరట

-ప్రభుత్వ స్కూళ్లో మంచి విద్య…నాణ్యమైన భోజనం -సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో ముఖాముఖీలో ఆదివాసీ మహిళలు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతిబిడ్డకు ఆర్థిక సాయం అందుతుండటంతో తమకు విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు అన్నారు. ఈ పథకం తమ పిల్లల చదువుకు ఎంతో అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ …

Read More »

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

-తల్లిదండ్రులు-టీచర్లు కలిస్తేనే విద్యార్థుల విజయం -మెగా పీటీఎంతో విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం -ప్రభుత్వ బడులపై పెరుగుతున్న నమ్మకం -సంక్షేమం విషయంలో రాజీ ప్రసక్తే లేదు -గిరిజనులకు అండగా ఉంటాం… ఆందోళన వద్దు -రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ …

Read More »

రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్‌కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు

-రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్ కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు నమోదయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాయలసీమ ప్రాంతంలోని పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, కలికిరి, పట్టికొండ, రాప్తాడు (ప్రైవేట్ మార్కెట్), పీపుల్లి (ప్రైవేట్ మార్కెట్) మార్కెట్ యార్డులకు మొత్తం 5,564.91 మెట్రిక్ టన్నుల మొదటి రకం,6,650.17 మెట్రిక్ టన్నుల రెండవ …

Read More »

డ్వాక్రా బజార్ సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల ( వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ) అమలు చైర్మెన్ విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ సందర్శించారు. డ్వాక్రా మహిళలు చేసిన ఉత్పత్తులతో మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా దేశంలోని 16 రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల వారితో కలిపి 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఆ స్టాల్స్ …

Read More »

మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె మండలం పేటేరు గ్రామంలోని ఆంజనేయస్వామి కాలనీలో డ్వాక్రా సంఘ సభ్యురాలు కొఠారి సావిత్రి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం ద్వారా రూ.10 లక్షల రుణం, అందులో రూ.3.50 లక్షల సబ్సిడీతో ఏర్పాటు …

Read More »

ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలు అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు దోహదపడాలి

-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలు అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె మండల కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ భవిత ప్రత్యేక అవసరాల గల పిల్ల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,తో కలసి ప్రారంభోత్సవం …

Read More »

జాషువా ఆశయాల బాటలో వైఎస్ జగన్ పాలన : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-​ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి ​-సింగ్ నగర్ జనహిత సదనంలో చిత్రపటానికి నివాళులు -​అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న మహనీయుడని కొనియాడటం -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎదురైన ఛీత్కారాలనే సత్కారాలుగా, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకుంటూ, మానవత్వమే పరమావధిగా జీవించిన మహోన్నత వ్యక్తి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ​శుక్రవారం నగరంలోని సింగ్ నగర్ జనహిత సదనంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం …

Read More »

చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటు -పారిశ్రామీకరణతో స్థానికంగానే ఉద్యోగాలు -విద్యకు ప్రాధాన్యమిస్తున్న సీఎం చంద్రబాబు -పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సంక్షేమ పథకాలు అమలు -మెగా పీటీఎంతో విద్యార్థుల ప్రగతి మరింత పురోగతి : మంత్రి సవిత -స్టేషన్ పేట ఎంజేపీలో ఘనంగా మెగా పీటీఎం నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఉన్నత విద్య పూర్తికాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు …

Read More »

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్య

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత -త్వరలో మరో డీఎస్సీ నిర్వహణ -క్వాలిఫైడ్ టీచర్లతో విద్యా బోధన -సన్నబియ్యంతో విద్యార్థులకు రుచికరమైన భోజనం -విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ -విద్యార్థుల డ్రాపౌట్ల నివారణే లక్ష్యం -ఇంట్లో ఎందరు విద్యార్థులున్నా అందరికీ తల్లికి వందనం -మెగా పీటీఎంలతో విద్యార్థుల ప్రగతి మరింత పురోగతి -వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాక -జగన్ ది కేవలం ప్రచార పిచ్చి …

Read More »

రాష్ట్ర వైద్యానికి ‘సంజీవని’ జవసత్వాలు

-10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలు -2.48 లక్షల మంది రోగులకు వైద్యుల‌తో నేరుగా అపాయింట్‌మెంట్లు -ఎన్సీడీ 4.0 కింద గుర్తించిన 2.72 కోట్ల మంది ఆరోగ్య వివ‌రాలు సంజీవ‌నితో అనుసంధానం -‘ఆర్‌బియ‌స్‌కె’ విద్యార్థుల వివ‌రాలు కూడా -రేపు క‌ర్నూలు జిల్లా ఆస్పరిలో ‘సంజీవ‌ని’ని ప్రారంభించ‌నున్న సీఎం చంద్రబాబు -వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామంలో పరీక్ష చేయించుకున్న రోగి జిల్లా, బోధనాస్పత్రికి వెళ్లినా.. అతడి ఆరోగ్య చరిత్ర వెంటనే వైద్యుల ముందుకు …

Read More »