-విద్య.. వసతి.. వికాసం కార్యక్రమానికి శ్రీకారం -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో సంక్షేమ హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు ఇంటికి దూరంగా ఉన్నా ఇంటి వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో “విద్య వసతి వికాసం” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధునిక వసతి …
Read More »Daily Archives: August 4, 2026
డీఎస్సీపై వైసీపీ పిల్ను హైకోర్టు తిరస్కరించడాన్ని స్వాగతించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
-డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం -మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదు -10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం -కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్నివేళలా అండగా నిలబడుతుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి వైసీపీ నేతలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తిరస్కరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించిందని …
Read More »మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందడానికి వీలుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వారు తామున్న చోటు నుంచి కేవలం తమ మొబైల్ ఫోను ద్వారా ఇకపై ఈ పనులు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు
-రూ.12.60 కోట్ల నిధులు మంజూరు -జనవాణి, వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి డిగ్రీ కళాశాల సమస్యలు -చెట్ల కింద పాఠాలు చెబుతున్న దుస్థితిపై నాడు గళం విప్పిన పవన్ కళ్యాణ్ -నేడు శాశ్వత భవన నిర్మాణానికి బాటలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై శ్రద్ధ.. పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక శైలి. విన్న సమస్య, గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చూపుతారు. ఏలూరు డిగ్రీ కాలేజీ తరగతి గదుల లేమి సమస్య …
Read More »నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి
-తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత -లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు -రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో -కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మాణం పూర్తి -నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా -ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో …
Read More »అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై అనంతవరం, నెక్కల్లులో గ్రామసభల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ మంగళవారం, 2026 ఆగస్టు 4న వెస్ట్ సెంట్రల్-1 గ్రిడ్లో భాగమైన అనంతవరం, నెక్కల్లులో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్వర్క్పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, …
Read More »అమరావతిలో వరుసగా రెండో రోజు కొనసాగిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం సమావేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల అమరావతి పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం రెండో రోజు మంగళవారం, 2026 ఆగస్టు 4న రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహించింది. మంగళవారం ఉదయం APCRDAలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి, రాజధాని అమరావతి నగర పరిధిలో సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించి, రహదారి …
Read More »ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల నిర్వహణకు 103 పరీక్షా కేంద్రాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET-JUNE-2026) పరీక్షకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు 05.06.2026 నుండి 05.07.2026 వరకు స్వీకరించబడినవి. మొత్తం 2,14,486మంది అభ్యర్థులు 2,38,252దరఖాస్తులు సమర్పించారు. వీటిలో 74,711మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 84,798దరఖాస్తులు సమర్పించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, APTET-JUNE-2026 పరీక్షలు 05.08.2026 నుండి 16.08.2026 వరకు 11 రోజులపాటు, 22 సెషన్లలో, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. వీటిలో …
Read More »ఎల్ఐసి లో ప్రభుత్వ వాటాల అమ్మకం ఆపాలి
-బీమా ఉద్యోగుల ఆందోళనకు సిఐటియు మద్దతు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అగ్రగామి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి లో 6.5% ప్రభుత్వ వాటాల అమ్మకం దేశ స్వావలంబన కు నష్టం చేసే చర్య అని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బీమా ఉద్యోగులు బుధవారం చేసే ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఎల్ఐసి కోట్లాదిమంది పాలసీదారుల నమ్మకం, పొదుపుతో ఎదిగిన సంస్థ. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, …
Read More »తెలుగుజాతి గర్వించేలా అమరావతి
-మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత -2028 నాటికి నిర్మాణాలు పూర్తి -అద్భుతంగా మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాసాలు -జోరుగా రాజధాని రహదారుల నిర్మాణాలు -ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్న సీఎం చంద్రబాబు -అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ : మంత్రి అనగాని -చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది -మంత్రి నారా లోకేశ్ తో జగన్ కు పోలికే లేదు -జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి : మంత్రి సవిత -మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ -వైసీపీ …
Read More »
Prajavartha Online Telugu News