Breaking News

Daily Archives: March 25, 2025

అమరావతి రాష్ట్ర సచివాలయంలో 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం,ఈసమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,డిజిపి హరీశ్ కుమార్ గుప్తా,వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.తిరుపతి జిల్లా కలెక్టరేట్ వి సి హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,డి ఆర్ ఓ.నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆరోగ్య చికిత్స కేంద్రంకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేణిగుంట-౩ గ్రామ సచివాలయం ఆరోగ్య చికిత్స కేంద్రంకు (VHC)వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ కార్యక్రమం అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రేణిగుంట మండల పీహెచ్పీ పరిధిలోని రేణిగుంట-3లో గల ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు.గ్రామంలో గర్భవతులకు వైద్య పరీక్షలు చేయించారు. గర్భధారణ-సంరక్షణ, ప్రసవం తర్వాత తల్లి మరియు బిడ్డ సంరక్షణ, యుక్త వయస్సు లో జాగ్రత్తలు, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు జీవనశైలి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు …

Read More »

ప్రతి రైతుకూ గుర్తింపు సంఖ్య – జిల్లా వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీ

-వ్యవసాయ శాఖ, తిరుపతి జిల్లా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు (ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో యూనిక్కోడ్ (యూసీ) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలై జేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేం ద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు …

Read More »

ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఈ నెలాఖరులోపు ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే …

Read More »

సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు పై అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తారీఖు నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలును పక్కాగా అమలు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులతో, హోలేసేల్ వ్యాపారస్తులతో మరియు రిటైల్ వ్యాపారస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్ర కార్యక్రమంలో …

Read More »

నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామాని గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఇంచార్జి మేయర్ షేక్ సజిలా  తెలిపారు. మంగళవారం ఇంచార్జి మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన మెయిన్ ఆఫీస్ లోని కౌన్సిల్ హాల్లో నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జి మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ ఈ నెల 15న అప్పటి మేయర్ గా ఉన్న కావటి శివనాగ మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ …

Read More »

రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే పేద ప్రజలకు రూ.5కే నాణ్యమైన ఆహారం లభిస్తుందని, ఆహారం తీసుకుంటున్న ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ప్రస్తుతం టిఫిన్ చేయాలన్నా రూ.50 అవుతున్న …

Read More »

పారిశుధ్య, డ్రైనేజి సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలోని గోరంట్ల అన్నపూర్ణ నగర్ లో తీవ్రంగా ఉన్న పారిశుధ్య, డ్రైనేజి సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్  అన్నపూర్ణ నగర్, నగరాలు, గోరంట్ల, ఎస్వీఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ నగర్లో స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి, కమిషనర్  మాట్లాడుతూ …

Read More »

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , ఎస్పీ సతీష్ కుమార్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ అభివృద్ది పధకాలు , స్వర్ణాంధ్ర 2047 , వాట్సప్ గవర్నెస్ , గ్రీవియెన్స్ రిడ్రసల్ విధానం , భూ సంబంధిత అంశాలు , సమ్మర్ కార్యాచరణ , పీ4 , లా అండ్ ఆర్డర్ అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభిచారు. మార్చి 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు …

Read More »

జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం కలక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం(IYC) గా సంవత్సరంగా ప్రకటించిందని , దానికి అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని , IYC సంవత్సర వేడుకల కోసం లక్ష్యాలు …

Read More »