– విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులకు ప్రశంసా పత్రాలు – యోగంతో ఆరోగ్యం – భాగస్వామ్యంతో విజయం.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర–2026 రాష్ట్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా, యోగాంధ్రలో విశేషంగా పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. యువతకు ప్రశంసా పత్రాలను …
Read More »Monthly Archives: July 2026
రైతుల సమక్షంలోనే రీసర్వే …
-రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ కంచికచెర్ల/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా రైతుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కంచికచెర్ల గ్రామం, నందిగామ మండలం సోమవరం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. …
Read More »వినూత్న ఆలోచనలతో విజయవంతమైన వ్యాపారాలు
– ఆర్టీఐహెచ్లో స్టార్టప్లు, ఐపీఆర్పై విద్యార్థులకు అవగాహన – యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం – ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో డా. హరిబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు ఆర్టీఐహెచ్ అనేక కార్యక్రమాల ద్వారా విస్తృత సహకారం అందిస్తోందని ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈవో డా. హరిబాబు అన్నారు. విజయవాడలోని ఎనికేపాడులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) కార్యాలయంలో శనివారం స్టార్టప్లు, మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్)పై అవగాహన కార్యక్రమం …
Read More »ఓ మంచి ఆలోచనతో ముందడుగు వేద్దాం..
– చిన్నచిన్న మంచి అలవాట్లు సమాజంలో పెద్ద మార్పునకు పునాదులు – మన అందరి ఆరోగ్యం, ఆనందానికి సమష్టిగా కృషిచేద్దాం – రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందాం – పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి – స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన ఆనందమయ ఆరోగ్య ఆంధ్ర నిర్మాణంతో స్వర్ణాంధ్ర సాకారానికి ఓ మంచి ఆలోచనతో ముందడుగు వేయాలని.. సమాజంలో మార్పు మన నుంచే మొదలుకావాలని జిల్లా కలెక్టర్ …
Read More »గిరిపురం తాగునీరు సురక్షితం..
– ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – డయేరియా కేసులపై నిరంతరం అప్రమత్తం – ముందు జాగ్రత్తగా బబుల్స్తో నీటి సరఫరా – అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మవద్దు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ పరిధిలోని గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వదంతులు నమ్మవద్దని.. ఇక్కడి తాగునీరు సురక్షితమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. వైద్య ఆరోగ్యం, నగరపాలక సంస్థ.. సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిస్థితిని అత్యంత …
Read More »వ్యర్థల నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత – బొండా ఉమామహేశ్వరావు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే
-పరిసరాలు అందరూ పరిశుభ్రంగా ఉంచాలి – గద్దె రామ్మోహన్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జూలై నెల థీమ్గా “బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు మరియు నమోదు”ను విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ జి ఎన్ ఆర్ స్కూల్ లేబర్ కాలనీ, బివి సుబ్బారెడ్డి స్కూల్, కండ్రిక, మరియు కరెన్సీ నగర్ లో నిర్వహించారు. ముఖ్య …
Read More »సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు.దిశానిర్ధేశం చేశారు.
Read More »రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి
-రుణ వితరణ కార్యక్రమంతో వ్యాపారవేత్తలుగా సామాన్యులు -సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి నిర్మాలాసీతారామన్ సహకారం -కూటమి వచ్చాక రుణాల రీ- షెడ్యూల్తో రూ.1538 కోట్లు ఆదా -నరసరావుపేట రుణ వితరణ మేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు -వివిధ వర్గాలకు రూ.3,216 కోట్లు పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించటం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన పలువురు ప్రముఖులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్, కడప అర్బన్ …
Read More »రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి
-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి -హార్టీకల్చర్ హబ్కు నిధులు ఇవ్వండి -మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ -కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి …
Read More »
Prajavartha Online Telugu News