విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పుష్పాభిమానులకు రకరకాలైన బోకేల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాపీ ప్రారంభించారు. శుక్రవారం బందరురోడ్డులోని బృందావన్ కాలనీలో ఎ కన్వెన్షన్ ఎదురుగా ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాప్ను నిర్వాహకులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.శేఖర్, డి.అర్జున్ మాట్లాడుతూ అభిరుచిగల పుష్పాభిమానులు అభినందనలు తెలపడానికి, సెలబ్రటీలను, ప్రముఖులను, వివాహాది శుభకార్యాలకు సంబంధించి తదితర కార్యక్రమా లకు ప్రత్యక్షంగా అందజేసే బోకేలను, ఫ్లవర్ బకెట్స్ వివిధరకాల రంగులు కలిగిన పువ్వులతో అనేక రకాల మోడల్స్లో అందజేస్తున్నామన్నారు. …
Read More »Monthly Archives: July 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »తిరుపతి పార్లమెంట్ పరిధిలో రూ.4.99 కోట్ల గ్రామీణ రహదారి పనులకు కేంద్రం ఆమోదం
-ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చొరవ ఫలితం.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన నిరంతర కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎంపీ ప్రతిపాదించిన రహదారి పనులకు గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు తన సమ్మతిని తెలియజేస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తక్షణ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి ఎంపీ …
Read More »హస్తకళా మహోత్సవం–2026 చారిత్రక విజయం… లేపాక్షి సిబ్బంది కృషి మరువలేనిది
-రాష్ట్ర హస్తకళాకారుల అభ్యున్నతికి మరిన్ని సంస్కరణలు – లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన లేపాక్షి హస్తకళా మహోత్సవం–2026 అపూర్వ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు డా. పసుపులేటి హరి ప్రసాద్ లేపాక్షి సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మహోత్సవ విజయానికి ప్రతి ఉద్యోగి చూపిన అంకితభావం, …
Read More »వైద్య సేవల్లో చిన్నపాటి అలసత్వాన్నీ సహించేది లేదు..
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాల్సిందే – రోగుల నుంచి అత్యుత్తమ ఫీడ్బ్యాక్ వచ్చేలా సేవలందించాలి – న్యూ జీజీహెచ్ను రాష్ట్రంలోనే నెం.1 ఆసుపత్రిగా నిలపాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం విజయవాడ న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ వార్డులు, ఐసీయూలు, ఔషధ …
Read More »మరో నాలుగు రోజులు మాత్రమే సర్!
– ఓటర్లు త్వరితగతిన ఫారాలు బీఎల్వోలకు అందజేయండి – క్షేత్రస్థాయిలో సదా ఓటర్ల సేవలో బీఎల్వోలు, అధికారులు అందుబాటులో – ఈ నెల 11, 12 తేదీల్లో సర్ ప్రత్యేక శిబిరాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందని, ఓటర్లు త్వరితగతిన …
Read More »డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రజలందరూ సహకరించాలి
– జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావుతో కలిసి ఇంటింటి అవగాహన కార్యక్రమం, డెంగ్యూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి …
Read More »జిల్లాలో 77.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్
– సహకారాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – సర్పై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలోని కీలకదశ అయిన ఇంటింటి సర్వే సాఫీగా సాగుతోందని.. ఇప్పటివరకు 75 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్న రాజీకీయ పక్షాలు మరింత సహకారంతో కార్యక్రమం విజయవంతానికి చేయూతనివ్వాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి …
Read More »ఆర్టీఐ నిబంధనల అమలులో నిర్లక్ష్యం సహించం
-ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు -రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) లోని సెక్షన్ 4 (1) (బి) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టం అమలుపై శుక్రవారం విజయవాడ రూరల్లోని గొల్లపూడిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ …
Read More »సమాచార హక్కు అమలు.. సుపరిపాలనకు నిదర్శనం
– ప్రజలకు సమాచారమే శక్తి.. ఆ హక్కు పరిరక్షణే అధికారుల బాధ్యత – రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టీకరణ – విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు – నిబంధనలు ఉల్లంఘించిన కార్యాలయాలకు షోకాజు నోటీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతమవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి …
Read More »
Prajavartha Online Telugu News