నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ లతో ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా అధికారులు, రైస్ మిలర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే రెండు నెలలు కష్టపడి పనిచేసి …
Read More »Daily Archives: February 22, 2025
ఒడిశా సీఎం మోహన్ మోడిషా తో భేటీ అయిన కేంద్రం మంత్రి శ్రీనివాస వర్మ
భువనేశ్వర్, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోడిషా తో శనివారం సీఎం కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి వివిధ పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురి నేతల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి తమ శాఖ నుండి అవసరమైన సహకారం తప్పనిసరిగా అందజేస్తామని కేంద్ర మంత్రి …
Read More »వైభవోపేతంగా కూచిపూడి వారి వివాహ సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కూచిపూడి సాంబశివరావు (సతీమణి….గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ విజయ) సోదరుడు శ్రీనివాసరావు, స్వరూపా రాణి దంపతుల కుమారుడు కడప మున్సిపల్ కమిషనర్ చి. రాకేష్ చంద్ర….పొన్నూరు వాస్తవ్యులు మేకల శాంతి రాజు..శ్రీమతి ప్రసన్న కుమారి దంపతుల కుమార్తె చి.ల.సౌ. దా.ప్రజ్ఞరాజ్ ల వివాహం శనివారం రాత్రి గుంటూరు ఎటుకూరు రోడ్డు లోని ‘ వివాహ కాన్వెన్షన్ ‘ లో వైభవోపేతంగా జరిగింది. వివిధ రంగాల…వివిధ రాజకీయ పక్షాల …
Read More »ఆం.ప్ర.శాసనసభ ప్రాంగణంలో ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి
-అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభలో వక్తల వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీ.శ. 575 సం.లోనే తెలుగుభాషను రాజభాషగా చేసి తొలి తెలుగు శాసనాన్ని చెక్కించిన రేనాటి చోళరాజు ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడి శిలావిగ్రహాన్ని శాసనసభా ప్రాంగణంలో ప్రతిష్టింపచేయాలని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తొలి తెలుగు దివ్వె తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సభలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముందుగా సంఘ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి …
Read More »వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన తోపుల వరలక్ష్మికి మల్లాది విష్ణు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైన తోపుల వరలక్ష్మి శనివారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మల్లాది విష్ణు తన అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుబడే ప్రతీ కార్యకర్తకు దశలవారీగా సముచిత స్థానం కల్పిస్తామని మల్లాది విష్ణు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మరింత చేరువ కావాలని …
Read More »ఆధునిక విద్యకు ఆద్యుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్యం కోసం, జాతి అభ్యున్నతి కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, భారత దేశ తొలి …
Read More »ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శనివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు వారి సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఆక్వారైతులకు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎం – ఎం కె ఎస్ ఎస్ వై) పథకం వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో …
Read More »రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో డివిజన్, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2025 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రకృతి …
Read More »పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు శానిటరీ సెక్రెటరీ తో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుధ్యంలో మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్ధాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్ధాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని సేకరించిన …
Read More »
Prajavartha Online Telugu News