అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30న ఉగాది నాడు ప్రారంభించనున్న జీరో పావర్టీ-పి4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్) కార్యక్రమం సన్నాహకాలను గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. స్వర్ణ ఆంధ్ర@ విజన్ 2047 మరియు పదిసూత్రాల కార్యాచరణ అమలులో భాగంగా,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో పావర్టీ-పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్షిప్ (పి4)’ కు రూపకల్పన చేస్తోంది.దీని ద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములుగా మరియు ప్రత్యక్ష లబ్ధిదారులుగా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. జీరో పావర్టీ – …
Read More »Monthly Archives: March 2025
పంటల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు ప్రక్రియకు వేదికగా నిలిచిన కార్యశాలలు
-నేటితో ముగిసిన పంటల వారి కార్యశాలలు -డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు. -ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత నెల నుండి ప్రారంభమై ఈ నాటితో 10 పంటలలో ముగిసిన పంటల వారీ కార్యశాలలు -వరి ,మినుము ,కంది , పుల్ల శనగ ,ఆముదం ,మొక్కజొన్న ,పత్తి ,చిరుధాన్యాలు ,వేరుశనగ ,నువ్వుల పంటలలో జరుపుకున్న కార్యశాలలు -వినియోగదారుని ప్రాధాన్యత ,నిరంతర మార్కెట్ రేటు , అధిక దిగుబడులు,వాతావరణమునకు తట్టుకుని నిలిచే రకాల ప్రాతిపదికగా సీజన్ కు ముందునుంచే పంటల వారీగా కార్యశాలలు -తొలకరి …
Read More »రైతు రిజిస్ట్రీ – విశిష్ఠ సంఖ్య జారీ పురోగతి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ ను ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములోని రైతులకు రైతు రిజిస్ట్రీలో భాగముగా అతి తక్కువ సమయంలో 38.50 లక్షల మంది రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు చేయటం లో ప్రదర్శించిన పురోగతిపై డిల్లీ పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక ప్రశంసలు తెలియచేసారు .ఫిబ్రవరి రెండవ వారపు చివరలో ప్రారంభించినప్పుడు చివరి స్థానాలలో వున్న మన రాష్ట్ర ము ఇప్పటికి 64 % శాతం నమోదుతో 38.50 లక్షల మంది రైతులకు విశిష్ట సంఖ్యను నమోదు …
Read More »ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చే “అమరావతి చిత్ర కళా వీధి” పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి “అమరావతి చిత్ర కళా వీధి” పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని అన్నారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన …
Read More »ఇంటికో పారిశ్రామికవేత్త తయారీకి సమన్వయంతో పనిచేయాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సాధనకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లతో రెండు రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్ షాప్ కు మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రతి మట్టి రేణువూ.. వర్షపు చినుకూ మన మనుగడకు ఆధారం
– ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి – స్వయం సహాయ సంఘాల మహిళలను ప్రోత్సహించాలి – శాస్త్రీయ ఫలితాలతో అపోహలను తొలగించండి – ఖరీఫ్ కార్యాచరణ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన మనుగడకు ప్రతి మట్టి రేణువూ.. వర్షపు చినుకూ ఆధారమేనని.. ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లాలో ఉద్యమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయం-ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై …
Read More »ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత..
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »మిషన్ వాత్సల్యతో శిశు క్షేమం, సంక్షేమం
– గ్రామ, వార్డుస్థాయి కమిటీలు క్రియాశీలం కావాలి – 15రోజులకోసారి సమావేశాలు నిర్వహించాలి – కమిటీలకు డివిజన్ స్థాయిలో వర్క్షాప్ల నిర్వహణ – జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిస్సహాయ స్థితిలో ఉన్న, అవసరాలుగల చిన్నారుల క్షేమం, సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డుస్థాయి కమిటీలు క్రియాశీలం కావాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన …
Read More »ఉత్సాహభరితంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఏ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా, ఆనంద భరిత వాతావరణంలో జరిగాయి.. ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లను సైతం కడుపుబ్బ నవ్వించాయి.. ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక పోటీల్లో ఎవరికి వారు పోటీపడి తమ ప్రదర్శనలను ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్ లు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది …
Read More »ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలి…
-బేడ (బుడ్గ) జంగం జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలని బేడ (బుడ్గ) జంగం జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు అన్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బేడ (బుడ్గ) జంగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బేడ (బుడ్గ) జంగం జాతీయ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఎదుగుదలకు టిడిపి వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్టీఆర్ ఎనలేని కృషి …
Read More »
Prajavartha Online Telugu News