విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు మార్చి 30 మరియు 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కొరకు తెరిచి ఉంటాయి. మార్చి నెల ఆఖరి రెండు రోజులు పన్ను చెల్లింపుదారులు తమ GST, VAT, మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ ద్వారా www.apct.gov.in వెబ్సైట్ ద్వారా 24/7 చెల్లింపులు జరిపేందుకు సౌకర్యం కల్పించబడింది. వెబ్సైట్లో ఇ-పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చు. అసిస్టెంట్ …
Read More »Monthly Archives: March 2025
జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువు పొడిగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2025 ఏప్రిల్ 30 వరకూ e-KYC ప్రక్రియ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆహార భద్రతా చట్టం క్రింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయింపు కొరకు e-KYC ప్రక్రియ తప్పనిసరి లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని గడువు తేదీ లోగా e-KYC ప్రక్రియను పూర్తిచేయవచ్చు.
Read More »తలసరి ఆదాయం, జీడీడీపీలో జిల్లాను ముందంజలో నిలపాలి
– ఇతర జిల్లాలతో ఆరోగ్యకర పోటీతో సమష్టి భాగస్వామ్యంతో కృషిచేయాలి – స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి – అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధికి మించి పురోగతికి కృషిచేయాలి – జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు – వినూత్న ఆలోచనతో ఖిల్లాపై డీఆర్సీ నిర్వహించడం అభినందనీయం – జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక ఔన్నత్యానికి …
Read More »రేపు, ఎల్లుండి ఉగాది మరియు రంజాన్ పండుగల శెలవు దినాలైనప్పటికీ యధావిధిగా పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రేపు, ఎల్లుండి ఉగాది మరియు రంజాన్ పండుగల శెలవు దినాలైనప్పటికీ యధావిధిగా పని చేయనున్నజిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు… కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (2 రోజులే) గడువు ఉన్నందున ఈ నెల 30,31 తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగ సెలవు రోజులైనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి …
Read More »నల్లపాడు చెరువుని తనిఖీ చేసి, మ్యాప్ ని పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలోని 93 ఎకరాల నల్లపాడు చెరువుని పూడికతీయించి, సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇరిగేషన్, రెవెన్యూ, జిఎంసి అధికారులతో కలిసి నల్లపాడు చెరువుని తనిఖీ చేసి, మ్యాప్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 27వ డివిజన్లోని నల్లపాడు చెరువులో 93 ఎకరాలను 30-40 …
Read More »అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలి… : నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలని, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. శనివారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో సమయానుగుణంగా ఆహారం అందించాలన్నారు. అలాగే పేద ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆయా క్యాంటీన్ల …
Read More »విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై చర్యలు…
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ రెడ్డిపాలెం, గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, భారత్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్య పనుల కోసం కార్మికుల రేషనలైజేషన్, …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ (బడ్జెట్) సమావేశం వాయిదా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్ పై శనివారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన వెంటనే ఉగాది, రంజాన్ పండుగల అనంతరం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వాయిదా వేయాలని మెజార్టీ సభ్యుల కోరిక మేరకు నగర ఇంచార్జి మేయర్ షేక్ సజిలా , నగర కమిషనర్ తో చర్చించి శనివారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి సమావేశ తేదీని త్వరలో తెలుపుతామన్నారు.
Read More »రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని వేడుకున్న మంత్రి దుర్గేష్ -తెలుగు వాళ్లు తొలి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. తెలుగువారికి ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు అన్నారు.ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని ప్రార్థించానని తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో …
Read More »తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియ చేసిన కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. షెడ్రుచూలు కలియకతో ఉగాది పండుగ సందర్భంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులు ల కలయిక తో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు, కషాయం అనగా …
Read More »
Prajavartha Online Telugu News