Breaking News

Daily Archives: February 21, 2025

పంచాయితీరాజ్ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ నిర్వీర్యం చేశాడు

-వైసీపీ నేతలు పంచాయతీరాజ్ నిధులను పక్కదారి పట్టించారు -అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం వైదెన‌లో రూ.50 ల‌క్ష‌ల‌తో ముస్లిం క‌ళ్యాణ మండ‌పం -రాజకీయాలకు అతీతంగా వైసీపీ స‌ర్పంచ్ ల గ్రామాల‌కూ నిధులు -ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామాల‌ను ప‌ట్ట‌ణాల‌కు ధీటుగా అభివృద్ధి చేస్తాం -రూ.20 ల‌క్ష‌లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువ‌లు ప్రారంభం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి\అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయితీరాజ్ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వీర్యం చేశాడ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విమ‌ర్శించారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని బల్లికురువ మండలం, …

Read More »

రాష్ట్రంలో ప్రతిపాదిత వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల విలీనాన్ని పునః పరిశీలించాలి…

-వ్యవసాయం మరియు ఉద్యానవన విశ్వవిద్యాలయాల స్వతంత్ర హోదాను కొనసాగించాలని AP ఛాంబర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతిపాదిత వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల విలీనాన్ని పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు విజ్ఞప్తి చేసింది. AP ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో వ్యవసాయం మరియు ఉద్యానవన విశ్వవిద్యాలయాలు పోషించే కీలక పాత్రను నొక్కిచెప్పారు. వారి ప్రత్యేక సహకారాలను …

Read More »

సర్వేలను సకాలంలో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలను సకాలంలో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం సర్వేల వేగవంతంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలైన మిస్సింగ్ సిటిజన్, జియో కోఆర్డినేట్, నాన్ రెసిడెంట్ ఏపి లను త్వరగా పూర్తి చేయడానికి వార్డ్ …

Read More »

హాస్పిటల్స్, కమర్షియల్ భవనాలు సెల్లార్ లను పార్కింగ్ కోసమే వినియోగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హాస్పిటల్స్, కమర్షియల్ భవనాలు సెల్లార్ లను పార్కింగ్ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సెల్లార్ల వినియోగం, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు, ట్రాఫిక్ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. శుక్రవారం కమీషనర్ గారు తమ రోజు వారీ పర్యటనలో భాగంగా సాయి నగర్, అంకిరెడ్డిపాలెం, ఏటి అగ్రహారం, శ్రీరాం నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికులు, ఉద్యోగుల …

Read More »

ప్లాసిక్ వినియోగం, విక్రయంపై సంపూర్ణ నిషేధం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాసిక్ వినియోగం, విక్రయంపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంటుందని, ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా నగర ప్రజలు, వ్యాపార సంస్థలు నిషేధంపై నగరపాలక సంస్థకు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ (అమెండ్మెంట్ రూల్స్) 2021 ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ క్యారీ …

Read More »

బాకీలున్న షాపులను సీజ్ చేయడానికి రెవిన్యూ అధికారులు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థకు చెందినా షాపుల అద్దెలు మార్చి నాటికి నూరు శాతం చెల్లించాలని, బాకీలున్న షాపులను సీజ్ చేయడానికి రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక లీలా మహాల్ ఎదురుగా గల నగర పాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల లీజు దారులు 2024-25 ఏడాదికి సంబంధించిన అద్దె మొత్తాన్ని కమీషనర్ ఛాంబర్ లో కమీషనర్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా కమీషనర్ …

Read More »

కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు బండి భవాని కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ ను మరియు ఈ నెల 18న ప్రమాదంలో మరణించిన గొర్రెముచ్చు కొండమ్మ కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల చెక్కులను శుక్రవారం కమిషనర్ చాంబర్ నందు అందజేశారు. ఈ …

Read More »

కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ కి లారీ ఓనర్ల లేఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ చరిత్రలో మధ్యతరగతి వర్గానికి ముఖ్యంగా వేతనజీవులకు మున్నెన్నడూ లేనివిధంగా ఎన్డీఏ ప్రభుత్వం వరాలు కురిపించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని నోవో టెల్ హోటల్ లో కేంద్రబడ్జెట్ పై ఏర్పాటుచేసిన సమీక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు కేంద్రబడ్జెట్ పై చర్చలో పాల్గొన్నారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ఏపీ లారీ ఓనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి. …

Read More »