Breaking News

Monthly Archives: March 2025

పంజా సెంటర్ లోని హలీం స్టాల్స్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో రంజాన్ మాస సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ (chinni) గురువారం రాత్రి సందర్శించారు. ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ గణపతి రావు రోడ్డులోని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్ కార్యాలయానికి విచ్చేశారు.. అక్కడి నుంచి పంజా సెంటర్ వరకు నాయకులతో కలిసి ప్రజలను పలకరిస్తూ నడుచుకుంటూ వచ్చారు. హలీం స్టాల్స్ అన్నింటినీ సందర్శించి వారి యజమానులతో మాట్లాడారు. రంజాన్ మాసంలో …

Read More »

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందు అడుగు వేయాలి

-అనుమంచిపల్లి గ్రామ డ్వాక్రా మహిళలతో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ. ఆర్. డి. పి. ఆర్ ప్రతినిధుల సమావేశం జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా nirdpr కోఆర్డినేటర్ జి. వి నరసింహారావు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్. ఐ. ఆర్. డి ప్రతినిధి మురళి, ఎన్టీఆర్ జిల్లా …

Read More »

విజ‌య‌వాడ న‌గ‌ర స‌మ‌గ్రాభివృద్ధికి అధికారులు త్వరగా డీపీఆర్‌ల రూపకల్పనకు కృషి చేయాలి

-కలెక్టర్ కార్యాలయంలో క‌లెక్ట‌ర్ డా. జి. లక్ష్మీశ , సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు లతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశం -విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌న మౌలిక వ‌స‌తుల ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టి -ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కూ ప్రాధాన్యం -అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారులు -కాలువ క‌ట్ట‌ల సుంద‌రీక‌ర‌ణ‌, వాకింగ్ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకూ చ‌ర్య‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి ముఖ‌ద్వారమైన విజ‌య‌వాడ న‌గ‌ర అవ‌సరాల‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌ణాళిక ప్ర‌కారం అభివృద్ధి ప‌నులు …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన వి.ఎం.సి వెహిక‌ల్ డిపో మెకానిక్స్, హెల్ప‌ర్స్

-పెంచిన రూ.6 వేల హెల్త్ అల‌వెన్స్ ఇప్పించాల్సిందిగా విన‌తి ప‌త్రం అంద‌జేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ పారిశుద్ద్య విభాగం వెహిక‌ల్ డిపోలో ప‌ని చేసే మెకానిక్స్, హెల్ప‌ర్స్ వెహిక‌ల్ డిపో లో పనిచేసే డ్రైవ‌ర్లు, క్లీన‌ర్స్ కు పెంచిన హెల్త్ అల‌వెన్స్ రూ.6 వేలు త‌మ‌కు ఇప్పించాల‌ని కోరుతూ ఎంపి కేశినేని శివ‌నాథ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఎపి బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మ‌న్ గొట్టుముక్కల రఘురామరాజు …

Read More »

ఎపిలో సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్ నిర్మాణం : ఎంపి కేశినేని శివనాథ్

-ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన -నారా భువనేశ్వరి కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ దంప‌తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాసేవే ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఎన్నో సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఆ సేవలు ఎపి ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసే ల‌క్ష్యంతో విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేప‌ట్ట‌డం సంతోషంగా వుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జ‌రిగిన …

Read More »

ఆశా వర్కర్లకు గౌర‌వ వేత‌నం వెంటనే పెంచాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు గౌర‌వ వేత‌నం వెంటనే పెంచాల‌ని వైఎస్ఆర్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక చిరుఉద్యోగులు తమ జీవితాలను సమాజ సేవ కోసం అంకితం చేస్తూనే కనీస వేతనం కూడా అందుకోలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఆశావర్కర్ల జీతం 3 వేల నుంచి 10 …

Read More »

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం… : శారదాదేవి ఐ ఏ ఎస్

-ఘనంగా ప్రారంభమైన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కె శారదాదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం నుండి 5 రోజుల పాటు నందు జరుగు అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం మెదటి దశ లో భాగంగా …

Read More »

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విరివిగా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, రుణాలు మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్లో మెగా ఎంఎస్ఎంఇ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం మన జిల్లా అని, బ్యాంకర్లు …

Read More »

పేద‌రిక నిర్మూలన ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే

-ఈ నెల 8 నుంచి 18 వ‌ర‌కు స‌చివాల‌య సిబ్బంది ద్వారా కార్య‌క్ర‌మం -జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌రిక నిర్మూలన ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ నెల 8 నుంచి 18వ తేదీ వ‌ర‌కు జరిగే సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార …

Read More »

గృహాల నుండి పొడి తడి చెత్తను వేరువేరుగా సేకరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గృహాల నుండి పొడి తడి చెత్తను వేరువేరుగా సేకరించాలని జిల్లా డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో గురువారం ఉదయం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్రలో బాగంగా తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వని యజమానులపై అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడ …

Read More »