-విశాఖ ఉక్కును కాపాడుకోకుంటే చంద్రబాబును ప్రజలు నమ్మరు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు సుదీర్ఘ ఆందోళన తరువాత సమ్మెలోకి వెళ్లే పరిస్థితి అటు …
Read More »Daily Archives: May 20, 2025
యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమం… : జిల్లా ఇంచార్జ్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమమును నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని ఆ రోజున విశాఖపట్నం సముద్రం ఒడ్డున రాష్ట్రస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని, …
Read More »సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, జిల్లాలో పనితీరు మెరుగుపరుచుకుని ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి( సి జి ఓ) చిన్నారావు అధికారులకు సూచించారు మంగళవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి జి ఆర్ ఎస్) — మీకోసం …
Read More »ఎస్టేట్ విభాగం తో సమీక్ష సమావేశం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం సత్యనారాయణపురం లోగల సర్కిల్ 2 కార్యాలయంలో ఎస్టేట్ విభాగం, తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్టేట్ విభాగంలో గల విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తులైన కర్మల భవనాలు, స్వర్గపురి, కమ్యూనిటీ హల్లు, కళ్యాణ మండపాలన్ని ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని దానికనుగుణంగా ఎస్టేట్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో ప్రస్తుతం ఉన్న …
Read More »సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షం పడుతున్న వేళ రోడ్ల పైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా యం జి రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మల స్కూల్ రోడ్డు, పినమనేని పాలిక్ లేని రోడ్డు, జమ్మి చెట్టు సెంటర్, లోయల కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్, కండ్రిక ప్రాంతాలన్ని …
Read More »ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యం లో హెచ్.ఐ.వి., ఎయిడ్స్ పై అవగాహన వీధి నాటకము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశములు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కళాభారతి ప్రసాద్ బాబు కళాబృందంతో వీధి నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక భవానీపురం ఐరన్ యార్డ్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత …
Read More »
Prajavartha Online Telugu News