Breaking News

Daily Archives: May 26, 2025

ప్రభుత్వానికి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడీ యల్లమందారావు, కౌలురైతుల సంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ వాసు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ మొదటి వారం నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికి ఇంతవరకు పంటల వారీగా ప్రణాళికలు, క్రెడిట్ ప్రణాళికలు, …

Read More »

జూన్ తొలి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా ప్రారంభం -వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష -త్వరలోనే పట్టాలెక్కనున్న అఖండ గోదావరి, గండికోట పర్యాటక ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ ఆధునికీకరణ పనులు -కుంభమేళా స్ఫూర్తితో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో పర్యాటకులకు తక్షణ వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు -రాష్ట్రంలో హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు, లీజుకు మండువా లోగిళ్లు తీసుకునేలా ప్రణాళికలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ మొదటివారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు …

Read More »

ఏపీలో ఆయుష్‌ను గ‌త ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది

-కూట‌మి ప్ర‌భుత్వ‌మొచ్చాక ఆయుష్‌ను బ‌లోపేతం చేశాం -రాజ‌ధాని అమ‌రావ‌తిలో గ్లోబ‌ల్ మెడిసిటీ -దేశీయ‌,అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల్ని ఆక్షించేందుకు ఏపీలో స‌ద‌స్సు నిర్వ‌హిస్తాం -ఆయుష్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు -ఏపీలోని అన్ని పర్యాటక ప్ర‌దేశాల్లో హెల్త్ వెల్నెన్ సెంట‌ర్ల‌ను విస్త‌రిస్తాం -చెన్నైలో జ‌రిగిన ద‌క్షిణాది మంత్రులు, అధికారుల ఆయుష్ స‌ద‌స్సులో మంత్రి స‌త్య‌కుమార్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ప్ర‌భుత్వం ఆయుష్‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి …

Read More »

సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా ఉంటాం.. సంపూర్ణ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని వెల్లడి -థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోంది.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం -అందరికీ ఆమోదయోగ్యంగా నూతన ఫిల్మ్ పాలసీ..సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి -తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదు -సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రిపై …

Read More »

సుజనా చౌదరిని పరామర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి పెమ్మసాని వెళ్ళి సుజనా ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని ప్రజా …

Read More »

41 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహించుటకు ఆమోదం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 41 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు …

Read More »

ర్యాలీలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం (27వ తేదీ) ఉదయం 7 గంటలకు బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ జరగుతుందని, ర్యాలీలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారని, నగరంలోని యువత, సీనియర్ సిటిజన్స్, విద్యార్ధులు, స్వచ్చంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ కార్మికులు సూపర్వైజర్లు లేదా ఇతర విధుల్లో ఉండడానికి వీలులేదని, వారు కేటాయించబడిన పారిశుధ్య పనుల్లోనే ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం జిటి రోడ్, కెవిపి కాలనీ రోడ్ ల్లోని పలు ప్రాంతాలల్లో పర్యటించి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులుగా ఉన్న వారు పారిశుధ్య పనులు కాకుండా …

Read More »

అర్జీల్లోని ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. సోమవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్ లు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ …

Read More »

వార్డుల వారీగా మెగా క్లీనింగ్ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరు నగరం కోసం నగరంలో వార్డుల వారీగా చేపట్టిన మెగా క్లీనింగ్ కార్యక్రమంలో గుర్తించిన, ప్రజల ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం 21వ వార్డ్ లోని భాను ప్రసాద్ కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ, కెవిపి కాలనీ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి పర్యటించి మెగా …

Read More »