Breaking News

Daily Archives: May 11, 2025

ఈ నెల 12న తిరువూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

– తిరువూరు డివిజ‌న్ ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – క‌లెక్ట‌రేట్‌లోనూ అర్జీలు స‌మర్పించేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12వ తేదీ సోమవారం తిరువూరు డివిజన్ లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం తిరువూరులో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) జిల్లాస్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖ‌ల జిల్లాస్థాయి …

Read More »

అగ్ని ప్ర‌మాదాలు నుండి రక్షణ..

– విప‌త్తు సమయంలో ఎలా స్పందించాలి? – ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు మాక్ డ్రిల్‌ – 12 న ఉదయం కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ ను తిలకించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌మాద‌వ‌శాత్తు అగ్ని ప్ర‌మాదాలు సంభ‌విస్తే మ‌న‌ల్ని మ‌నం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీల‌ల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగ‌ల్లో ఎవ‌రైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడ‌తెర‌పి లేకుండా కురిసే భారీ వ‌ర్షాలు స‌మ‌యాల్లో భ‌వ‌నాలు కూలితే ఏమిచేయాలి? ఇలా వివిధ …

Read More »

కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ తోక జాడించింది

-పాకిస్థాన్ కాల్పుల విరమణ నాటకాలను ఎవరూ నమ్మవద్దు -స్వయంగా పాక్ ఆర్మీజనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దేశంపై దాడి చేయించారు -పాక్ దుశ్చర్యలకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి -నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గట్టి గుణపాఠం చెప్పాలి… ఇది దేశ ప్రజలందరి కోరిక -మురళీ నాయక్ వీర మరణం బాధాకరం -అమర వీరుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది -వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, …

Read More »

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

-భౌతికకాయాన్ని సందర్శించి అశ్రు నివాళి -పార్థీవదేవం వద్ద అంజలి ఘటించి సెల్యూట్ చేసిన మంత్రి లోకేష్ -తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్ -అధికార లాంఛనాల మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి -పార్థీవదేహాన్ని స్వయంగా మోసిన మంత్రి లోకేష్, దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలన పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ …

Read More »

తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి సారె సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More »

ప్రతి ఒక్క కార్యకర్త ని నాయకుడిని చేసే బాధ్యతను నేను తీసుకుంటా…

-నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం – ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ముందుకు సాగాలి -27వ డివిజన్ లో భారీ చేరికల కార్యక్రమంలో MLA – బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సాంబమూర్తి రోడ్ రజక కళ్యాణ మండపంలో ఆదివారం సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు, వంగవీటి రాధా రంగా మిత్రమండలి విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల …

Read More »

శైవం విలసిల్లిన పవిత్ర భూమి… తమిళనాడు

-ద్రావిడ మూలాలు దక్షిణాది అంతటా ఉన్నాయి -పొత్తు రాజకీయాలు భవిష్యత్తులో అవసరం అని నమ్ముతాను -అన్ని వర్గాలను కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్ళాలి -ఎంజీఆర్, జయలలిత హయాంలలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం -ప్రజల క్షేమం, శ్రేయస్సే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం కావాలి -తమిళనాడు నుంచి వచ్చిన నాయకులు, ప్రజా సంఘాలు, విభిన్న వృత్తుల నిపుణుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాజకీయం అంటే బాధ్యత… అధికారం అంటే ప్రజా క్షేమాన్ని ఆలోచించే మార్గం …

Read More »

పొగాకు రైతుల ఆత్మహత్యలు నివారించాలి… : ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం మేరకు గత సంవత్సరం చెల్లించిన రేట్లకే నల్లబర్లీ, వైట్ బర్లీ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.నల్లబర్లీ పొగాకు కొనుగోలులో కంపెనీలు సిండికేటుగా మారి కౌలురైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నరన్నారు. కంపెనీల చేత పొగాకును కొనుగోలు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని అందువల్లే పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకోవాలని, అన్ని రకాల పొగాకు మొత్తాన్ని …

Read More »

దేశానికి గొప్ప భావితరాలను అందించే బాధ్యత, అదృష్టం తల్లికె దక్కుతుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, చైర్మన్, ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో మదర్స్ డే సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ, దేవుని ప్రేమ తర్వాత, తల్లి ప్రేమ చాలా గొప్పదని, బిడ్డని తన పేగు బంధంతో నవ మాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, చనుబాలుగా మారిన తన రక్తాన్ని పంచుతూ, తాను చేసిన త్యాగానికి ఏమి ఆశించకుండా బిడ్డను పెంచి, పెద్ద చేసి ప్రయోజకుడుక చేయటంలో అమ్మ పాత్ర చాలా గొప్పది, …

Read More »

ఈ నెల 12వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం-

-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు …

Read More »