Breaking News

Daily Archives: May 2, 2025

ప్రతి ఒక్కరూ ‘నా రాజధాని’ అని గర్వించేలా అమరావతిని నిర్మిస్తాం

-రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని -రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది మా సిద్దాంతం -రాజధాని పనుల పున: ప్రారంభమే కాదు… రాజధాని ప్రారంభోత్సవం కూడా మోదీ చేతుల మీదుగానే చేస్తాం -మోదీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతం… ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది -పహల్గాం దాడి ఘటనతో మోదీలో ఆవేదన చూశాను -దేశం కోసం ప్రధాని తీసుకునే అన్ని నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం: అమరావతి పున: ప్రారంభ సభలో సిఎం చంద్రబాబు నాయుడు -హమ్ ఆప్ కే సాత్ హై …

Read More »

అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పునః ప్రారంభించారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి 58 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు.ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన అమరావతి భూమిపై నిలబడి తాను కేవలం ఒక నగరాన్ని మాత్రమే కాకుండా ఒక కల నిజమవుతుందని,ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రను చూస్తున్నానని పేర్కొన్నారు. “అమరావతి అనేది సంప్రదాయం …

Read More »

వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

-ఐబీఎం, టీసీఎస్, ఎల్‌&టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం -‘క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు -ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ -దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్వాంటం కంప్యూటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు …

Read More »

చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపాలని చూశారు

-ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు -ఇక మనకు తిరుగులేదు…అమరావతి అన్ స్టాపబుల్! -ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతికోరికను మోడీజీ తీరుస్తున్నారు -కులగణనతో వెనుకబడిన వర్గాల దశాబ్ధాల కల సాకారం -నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయం -అమరావతి రీస్టార్ట్ సభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబు పై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు, ఒక్క ఇటుక పెట్టకుండా మూడు …

Read More »

ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రైతులు గత ఐదేళ్లుగా సాగించిన ధర్మ పోరాటంలో విజయం సాదించారని, రైతుల అలుపు లేకుండా చేసిన పోరాటానికి శిరస్సు మంచి నమస్కరిస్తునన్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాన్ కొనియాడారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ది పనుల పున: ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ది పనుల పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి కృతజ్ఞతలు …

Read More »

రాజధాని పనుల పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో రాజధాని పనుల పునఃనిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు …

Read More »

అమరావతి రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది

-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటు వంటి స్వార్ధం లేకుండా అమరావతి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ ధన్యవాదములు అంటూ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన స్వాగతోపన్యాసంలో తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అభివృద్ది పనుల పున: ప్రారంభ సభలో ఆయన స్వాగతోపన్యాసం చేస్తూ పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధాన మంత్రి …

Read More »

ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కి గన్నవరం విమానాశ్రయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలతో పాటు అమరావతి రైతుల కలలు నెరవేరనున్నాయని మాజీ కేంద్రమంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ …

Read More »

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీకి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-భావితరాల భ‌విష్య‌త్తు అమ‌రావ‌తి రాజ‌ధాని -డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ వ‌ల్లే ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ జీవం గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నులకి శంకుస్థాప‌న చేసేందుకు శుక్ర‌వారం విచ్చేసిన ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీకి గ‌న్న‌వ‌రంలోని విజ‌య‌వాడ అంతర్జాతీయ‌ విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కేర‌ళ లోని తిరువ‌నంతపురం నుంచి ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్రాయానికి పీఎం మోదీ చేరుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్ని …

Read More »

ప్రధాన మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 06:07 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం …

Read More »