Breaking News

Monthly Archives: July 2026

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మేదర సురేష్‌కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ‘రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల’ నియామకం జరిగింది. దానిలో భాగంగా పార్టీని నమ్ముకుని, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన విజయవాడ సెంట్రల్ నుంచి మేదర సురేష్‌కుమార్‌ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మేదర సురేష్‌కుమార్ మాట్లాడుతూ పార్టీని నమ్మకున్న ప్రతివారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు వుంటుందని, దానికి నిదర్శనమే …

Read More »

భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ మరియు లేపాక్షి హస్తకళల స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి సవితమ్మ – డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సవితమ్మ మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మరియు లేపాక్షి హస్తకళల ఎక్స్పో స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్స్టైల్ …

Read More »

ఢిల్లీలో మంత్రి సవితమ్మ కి ఘన స్వాగతం పలికిన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవితమ్మ కి ఢిల్లీలోని లీ-మెరిడియన్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ లేపాక్షి సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు.

Read More »

ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

-కడప కార్పోరేషన్ సమీక్షా సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కేఎంసి అదనపు కమిషనర్ రాకేష్ చంద్రంతో కలిసి ప్రజారోగ్య, పారిశుధ్య, ఇంజనీరింగ్ …

Read More »

వ్యర్థాల నిర్వహణలో ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ పరిశీలన కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు ప్రజారోగ్య భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కడప నగర పాలక సంస్థ పరిధిలోని కనుమలోపల్లి వద్ద నిర్వహణలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. అక్కడి …

Read More »

సాంకేతికత ఎంత పెరిగినా ‘సంస్కృతే’ మన గుర్తింపు

-అన్నమయ్య సంకీర్తనల కళా వైభవం* -సంగీతం వ్యక్తిత్వ వికాసానికి మార్గం* -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా, భావితరాలు గ్లోబల్ సిటిజన్స్‌గా మారినా.. మన సంస్కృతి, కళలే మన ఉనికికి ఆధారాలు” అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు డాక్టరు జి.లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో డాక్టరు శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేబీఎన్‌ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన అన్నమాచార్య …

Read More »

విజయవాడలో “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం – 2026”

-ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అద్భుతమైన హస్తకళల సాంప్రదాయాలను ప్రోత్సహించడానికి మరియు హస్తకళాకారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో విజయవాడలో నాలుగు రోజుల పాటు “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం – 2026” ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని, పంటకాలువ రోడ్డులో ఉన్న మారిస్ స్టెల్లా …

Read More »

ఈ నెల 17న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణ‌లంక‌లోని అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు మునిసిప‌ల్ కార్పొరేషన్ హైస్కూల్ వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు అర్జీలను ఉదయం …

Read More »

విద్యా ప్ర‌మాణాల పెంపున‌కు వినూత్న కృషి

– పదో తరగతి విద్యార్థులకు హిందీ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ – ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక అధ్యయన పుస్తకం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్య‌య‌న పుస్త‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియ‌ల్‌ను స‌ద్వినియోగం చేసుకొని మంచి ఫ‌లితాలు సాధించాల‌ని సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. విద్యాశాఖ అధికారుల‌తో కలిసి గురువారం క‌లెక్ట‌రేట్‌లో హిందీ స్ట‌డీ మెటీరియ‌ల్‌ను …

Read More »

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన డ్రెయిన్లలో ప్రత్యేక శుభ్రత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన డ్రైన్లలో ప్రత్యేక శుభ్రతను చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం నైజాం గేట్, వన్‌టౌన్‌లోని మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను లాంగ్ ఆర్మ్ ఎక్స్‌కవేటర్ సహాయంతో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, …

Read More »