Breaking News

Monthly Archives: February 2025

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి

– ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని తు.చ‌. త‌ప్ప‌క పాటించాలి – జిల్లా ప‌రిధిలో 20 ఎంసీసీ బృందాల ఏర్పాటు – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను కోరారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై వివిధ రాజ‌కీయ పార్టీల …

Read More »

ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌తో స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీ

-పెన్ష‌న్లు అందించే ప్ర‌క్రియ‌ను క్షేత్ర‌స్థాయిలో పరిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని దృష్టిలో ఉంచుకొని ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌తో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియను స‌జావుగా చేప‌ట్డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శ‌నివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. కంచిక‌చ‌ర్ల మండ‌లంలోని ప‌రిటాల‌, ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం మూల‌పాడులో ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి …

Read More »

డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశం

-ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్… ఏర్పాట్లు పక్కాగా ఉండాలి -పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం (నేడు) ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు జెసి ఛాంబర్ నందు అందజేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా …

Read More »

ప్రభుత్వ ఉద్యోగుల నూతన సంఘం లోగో ఆవిష్కరించిన మంత్రి మరియు జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కేంద్రంగా నూతనంగా ఏర్పడ్డ ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం’ యొక్క లోగో ను ఈరోజు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు, ఉద్యోగులు ప్రత్యక్ష సామాజిక సేవా చేయాలనే లక్ష్యంతో ఏర్పడ్డ ఈ సంఘంనకు వారు శుభాకాంక్షలు తెలిపారు, అలాగే, సాధ్యమైన పనుల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్య …

Read More »

కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: బడ్జెట్ అంచనాలు 2025-26 · అప్పుల రూపంలో సమకూరే సొమ్ములు మినహా మొత్తం వసూళ్లు రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ. 50.65 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. · నికర పన్ను రాబడుల అంచనా రూ.28.37 లక్షల కోట్లు. · ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా. …

Read More »

బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్ర‌శంస‌లు

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మల సీతారామన్‌తో మాట్లాడిన ప్ర‌ధాని ఈ బడ్జెట్‌పై దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని అభినందించారు. బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరానికి రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి …

Read More »

కేంద్ర బడ్జెట్ లో ఎపి కేటాయింపులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు. 2025-26 ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు ఏపీ …

Read More »

సామాన్య భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్దపీట వేసే విధంగా పలు చర్యలు చేపడుతున్నాం

-మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా సమన్వయంతో నిర్వహించండి: జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘనంగా మహా శివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్ష సమావేశం… మహోత్సవాల నిర్వహణ ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత, సమైక్యత పెంపొందించడం సిఎం లక్ష్యం -క్యూ లైన్లలో భక్తులకు వాటర్ బాటిల్, ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తాం… మహిళలు, పిల్లలకు క్యూ లైన్లో పాలు, బిస్కెట్లు అందించనున్నాం -27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ ధర …

Read More »

ఆంధ్ర క్రికెట్ జ‌ట్టుకు అభినంద‌నలు తెలిపిన ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన రంజీ ట్రోఫీలో రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో అద్బుత‌మైన విజ‌యం సొంతం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ జ‌ట్టు ను ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు. ఈ మేర‌కు ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపికేశినేని శివ‌నాథ్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్ర క్రికెట్ జట్టు సాధించిన ఈ అద్భుత విజయం ఎంతో సంతోషం క‌లిగించింద‌న్నారు. ఈ ఏడాది ఆరంభాన్ని గెలుపుతో ప్రారంభించ‌టం చాలా ఆనందంగా వుంద‌న్నారు జట్టులోని ప్రతి …

Read More »

వ్యవసాయ రంగానికి మరింత ఉత్తేజం ఇచ్చిన బడ్జెట్

-కింజరాపు అచ్చెంనాయుడు, వ్యవసాయ మంత్రి  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఋజువయ్యిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు  బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ఒక తరగతికో వర్గమునకో పరిమితం కాకుండా అభివృద్ది మరియు సంక్షేమ ములలో అన్ని వర్గాలను ముఖ్యముగా రైతులు ,మహిళలు ,యువత మరియు మద్యతరగతి తదితర అన్ని వర్గాల అభివృద్ది …

Read More »