-బీజేపీ పాలనలో కులాలు, మతాలు మధ్య చిచ్చు… -దేశ సమైక్యతకు ప్రతిపౌరుడు కదిలిరావాలి…. -సామ్రాజ్యవాద శక్తులపై పోరాడటమే కార్ల్ మార్క్స్కు అసలైన నివాళి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జరిగిన కాశ్మీర్ ఘటనను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ దేశంలో కులాలు, మతాలు మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని, దేశ సమైక్యతను చాటేందుకు ప్రతిఒక్కరు కదిలిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు నిచ్చారు. మహా …
Read More »Daily Archives: May 5, 2025
వియత్నం వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకం.
-చైనా తరహాగా అభివృద్ధి బాట -వియత్నాం పునరేకీకరణ 50వ వార్షికోత్సవ వేడుకులకు హాజరు కావడం గర్వకారణం -ప్రతిధ్వనించిన శాంతి, ఐక్యత, అభివృద్ధి అంశాలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నంతో సరితూగగల పోరాటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, ఆ దేశ వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. నేడు ఏకైక కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంగా అన్నింటా వియత్నం విరజల్లుతోందని, విద్యా, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఎంతో విశిష్టత సాధించిందని, నాడు అగ్రరాజ్య అమెరికా …
Read More »అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి…
-రేపు (మే 6న) పంట నష్టాల పరిశీలన – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న (మే4న) సంభవించిన ఈదురుగాలులు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం హఠాత్తుగా సంభవించిన ఈదురు గాలులు, అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. …
Read More »అకాల వర్షాలపై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం
-క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో పటిష్ట సమన్వయం -కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలపై ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని, జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో విపత్తుల నిర్వహణ, వ్యవసాయం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో …
Read More »పారదర్శక విచారణతో అర్జీలను పరిష్కరించండి
-జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు మొత్తం 117 అర్జీలు -కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విచారించి, పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. …
Read More »పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయిపట్టి నడిపించండి
-యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించండి -ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా అడుగులేయండి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -ఎంఎస్ఎంఈ థీమ్ స్టాల్ను ప్రారంభించిన కలెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికతకు అనుగుణంగా, ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేలా ముఖ్యంగా యువత, మహిళలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో …
Read More »ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి
-విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై …
Read More »1156 కూచిపూడి నృత్య ప్రదర్శనలతో గిన్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాల సరస్వతి
-అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూచిపూడి నృత్యంలో 1156 ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన మోదుకూరి బాల సరస్వతిని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూచిపూడి నృత్యంలో గత 12 సంవత్సరాలుగా శిక్షణ అభ్యసిస్తూ, అందులో ఇప్పటివరకు 1156 నృత్య ప్రదర్శనలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో …
Read More »
Prajavartha Online Telugu News