Breaking News

Daily Archives: February 1, 2025

సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సర్వం సిద్దం…

-ఎన్నికల అధికారి మరియు జియంసి అదనపు కమీషనర్ …. చల్లా ఓబులేసు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేది సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు, ప్రిసైడింగ్ అధికారి డి.సి శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ కంపార్ట్ …

Read More »

ఎన్నికల కోడ్ సందర్భంగా జిఎంసి పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జనవరి 29 వ తేది నుండే ఎన్నికల నియమావళి అమలులోఉన్నందున ఈనెల 3వ తేదిన జిఎంసిలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని, కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

8 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్ల పంపిణీ విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరిచిన 8 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను శనివారం ఉదయం 6 గంటల …

Read More »

మేరీమాత ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసే ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, ఏలూరు రోడ్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, త్రాగునీరు, …

Read More »

పెన్షన్లు పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి

-నిత్యం త్రాగునీటి పరీక్ష నిర్వహిస్తుండండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల పెన్షన్ల పంపిణీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం 18వ డివిజన్ వాటర్ ట్యాంక్ రోడ్, రాణి గారి తోట ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా తామే ఆధార్ కార్డు , రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్ లో పరిశీలించి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి ప్రతి నెల …

Read More »

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి

-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ సమావేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ కోరారు. శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లోని తన ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ నిర్వహణపై వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. ఈ నెల ఫిబ్రవరి 3న …

Read More »

బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరం… : సిపిఐ కె.రామకృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరం. యధాతధంగా ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి మొండిచేయి దక్కింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కేంద్రీయ విద్యాసంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బీహార్ కు మాత్రం మకాస్ బోర్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ …

Read More »

బడ్జెట్‌ రైతాంగాన్ని పూర్తిగా నిరాశపర్చింది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతాంగాన్ని పూర్తిగా నిరాశపర్చిందని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రైతాంగం దేశవ్యాప్తంగా చట్టబద్ద యం.యస్‌.పి. కావాలని ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకతను మరోసారి చాటి చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని రైతాంగానికి మద్దతు ధరలు కల్పిస్తామని …

Read More »