Breaking News

Monthly Archives: March 2025

13న కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు

-నూతన ఆలయ నిర్మాణం -తొలి తిరునాళ్లు -150 ఏళ్ల చరిత్ర కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : కానూరు తిరుపతమ్మ తిరునాళ్ళకు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది ఆలయం. ఏడాది క్రితం నూతనంగా మాజీ సర్పంచ్ దేవభక్తుని సుబ్బారావు నేతృత్వంలో నూతన ఆలయ పునః ప్రతిష్ట జరిగింది. ఈ ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెనుగ్రంచిప్రోలు అమ్మవారు తిరునాళ్లు తరువాత కానూరు గ్రామ తిరునాళ్లే రెండవ అతిపెద్ద తిరునాళ్లు నిర్వహించే ఆలయంగా చెప్పుకోవచ్చు. కానూరు గ్రామంలో 150 ఏళ్ల క్రితం …

Read More »

యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

-ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కొంతకాలం పి జి ఆర్ ఎస్ …

Read More »

ముఖ్య జంక్షన్ లలో ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరములో  ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి ఆదేశముల మేరకు ముఖ్య జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడమైనది. ఈ విషయం గుర్చి నగర ప్రజలకు ట్రాఫిక్ విభాగము తరుపున తెలియచేయునది ఏమి అనగా వాహన దారులు సిగ్నల్ జంక్షన్ల వద్ద రెడ్ లైట్ పడినప్పుడు తప్పని సరిగా వైట్ లైన్ వద్ద ఆగి వెళ్ళ వలెను అలా ఆగకుండా వెళ్ళినచో మీ యొక్క వాహనమును ఆటో మేటిక్ సిగ్నలింగ్ సిస్టం …

Read More »

మహిళా సాధికారతకై మానవత కృషి అమోఘం

-టీవీ విజయలక్ష్మి డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి కొరకై మహిళలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి అభినందించారు. ఈ నెల 8వ తేదీ స్థానిక ఆర్య సమాజం సమావేశ మందిరంలో మానవతా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకకు టీవీ విజయలక్ష్మి ఆత్మీయ అతిథిగా హాజరై ప్రసంగించారు మహిళలు స్వయం ఉపాధితోనే స్వేచ్ఛను పొందగలరని తద్వారా కుటుంబ సభ్యులు …

Read More »

మంత్రి నారా లోకేష్ ఈనెల 10వ తేదీన జిల్లాలో పర్యటన

-జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 10వ తేదీన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది. సోమవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి  నారా లోకేష్  సోమవారం అనగా(10.3.25) మధ్యాహ్నం విజయవాడలోని ఉండవల్లి నివాసం …

Read More »

నూతనంగా అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గాంధీనగర్‌ ఐనాక్స్‌ థియేటర్‌ ఎదురుగా అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మామిళ్ళపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ రెండవ బ్రాంచ్‌గా గాంధీనగర్లో ఐనాక్స్‌ థియేటర్‌ ఎదురుగా ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలిపారు. మొదటి బ్రాంచ్‌ రామకృష్ణాపురం బుడివేలు వంతెన దగ్గర ప్రారంభించి భోజనం ప్రియులు ఆధారాభిమానాలతో అభివృద్ధి చెందుతూ దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. ఆస్ఫూర్తితోనే రెండో బ్రాంచ్‌గా గాంధీనగర్‌లో స్టార్ట్‌ చేశామన్నారు. అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ …

Read More »

ఆంధ్ర రాష్ట్ర విలేజ్‌ సర్వేయర్‌ అసోసియేషన్‌ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్ర రాష్ట్ర విలేజ్‌ సర్వేయర్‌ అసోసియేషన్‌ ధర్నా నిర్వహించింది. ఆదివారం విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.మధుబాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సచివాలయంలో సర్వేయర్లుగా పని చేస్తున్న అందరిని రాష్ట్రస్థాయి గూగుల్‌ మీట్‌ సమావేశం ఫిబ్రవరి నెల 25వ తేదీన నిర్వహించమని ఈ సందర్భంగా సర్వేయర్లు …

Read More »

నగరంలో న్యూ పారడైజ్‌ బిర్యాని రెస్టారెంట్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోజన ప్రియులకి నగరంలో న్యూ పారడైజ్‌ బిర్యాని రెస్టారెంట్‌ ప్రారంభమైంది. ఆదివారం గాంధీనగర్‌, అలంకార్‌సెంటర్లో న్యూ పారడైజ్‌ బిర్యాని రెస్టారెంట్‌ని ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమారుడు బొండా రవితేజ విచ్చేసి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంతో రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందజేస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ నిర్వాహకులు మేనేజింగ్‌ డైరెక్టర్‌ యార్లగడ్డ డేవిడ్‌ న్యూ ప్యారడైస్‌ బిర్యాని రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక్కరోజు ఆఫర్‌గా చికెన్‌ …

Read More »

ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల‌పై ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు

-ప్ర‌తి ఇంటిలో ఒక‌రు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా చేసేందుకు ఎంపి కేశినేని కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ఆదివారం విజయవాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్త అమ్మ‌వారి గుడి వ‌ద్ద‌ న‌గ‌రాల సామాజిక వ‌ర్గ సంఘాల‌కు, గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విశ్వ బ్రాహ్మణులకు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ అందుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారైందుకు అవగాహన …

Read More »

ఉపనయనాలు నిర్వహించటం హర్షణీయం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపనయన కార్యక్రమాలు నిర్వాహకులు ఉచితంగా నిర్వహించడం హర్షణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రామకోటి మైదానం దగ్గర రోటరీ విజ్ఞాన మందిరం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది …

Read More »