-ఎంపీ కేశినేని చిన్నిను కలుసుకున్న యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు -యోగాసన అథ్లేట్స్ ను సన్మానించి ఎంపీ కేశినేని చిన్ని -యోగా ఆర్టిస్టిక్ పెయిర్ ప్రదర్శన తో అలరించిన అథ్లేట్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను యోగాంధ్రప్రదేశ్ గా చేసేందుకు సహకరించిన యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ …
Read More »Monthly Archives: June 2025
ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »యోగ ప్రతి ఒక్కరి జీవితంలో జీవనశలిగా మార్చుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగ ప్రతి ఒక్కరి జీవితంలో జీవనశలిగా మార్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మి అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారము ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష గారితో కలిసి బి ఆర్ టి ఎస్ రోడ్డు నందు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ యోగాసనాలు చేయటం జీవనశలిగా మారాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితం జీవించాలని, …
Read More »ఈ నెల 30వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »మానత్వానికి ప్రతీకగా నిలిచిన మానవత స్వచ్ఛంద సంస్థ
-పులి శ్రీనివాసులు, ఐఏఎస్, కమిషనర్ ,గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గత మూడు సంవత్సరాలుగా గుంటూరులో బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ ఆదివారం ఉదయం గుంటూరులోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన మానవత 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గుంటూరు నగరంలో 5 లక్షల మొక్కలను …
Read More »సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఉన్నందున జిఎంసి పార్కింగ్ దగ్గరలోని జనన మరణ నమోదు విభాగం ఎదురు …
Read More »ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లు పోటీలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు కృష్ణాజిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ (10) చైల్డ్ మరియు అండర్ (12) మిని విభాగంలో ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ నకు 10 జిల్లాల నుండి 200 మంది క్రీడాకారులు ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లు పోటీల లో పాల్గొననున్నారు. ఆదివారం ఈ సందర్భంగా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా …
Read More »సోలార్ పవర్ వాడుదాం – పర్యావరణాన్ని రక్షిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ EX IMA ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సాంగ్వి వారి సొంత ఖర్చులతో IMA హాల్ కి సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం ఈ సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్య ఘర్ ప్రోగ్రాం కింద ఇళ్ల వద్ద, కార్యాలయలు, ఇటువంటి హాస్పిటల్స్ కు సోలార్ …
Read More »జూలై ఒకటి న మలకపల్లి గ్రామంలో సీఎం పర్యటన
-పెన్షన్ పంపిణీ, మార్గదర్సుల, లబ్ధిదార కుటుంబాలతో ముఖాముఖి -కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో , అనంతరం పి.4 గ్రామ సభలో పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో జూలై ఒకటి …
Read More »జూన్ 30 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్
-“డబల్ వన్ డబల్ జీరో” కి ఫోన్ చేసి పిజిఆర్ఎస్ పరిష్కార స్థాయి తెలుసుకోండి -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా ప్రజలకి పౌర సేవలు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “డబల్ వన్ …
Read More »
Prajavartha Online Telugu News