-కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేయడంపై హర్షం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్ షాపు డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, అందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్యులు కందుల దుర్గేశ్ కి రేషన్ డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిడదవోలు లోని మంత్రి వారి కార్యాలయంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్ వాహనాల రద్దును ఆహ్వానిస్తున్నామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా …
Read More »Monthly Archives: May 2025
ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత నిర్బంధ ప్రవేశాల తొలి విడత లాటరీ ఫలితాలు విడుదల
-37,427 మంది పిల్లలు నమోదు… మొదటి విడత లాటరీలో 23117 మందికి సీట్లు కేటాయింపు -వెబ్ సైట్లో నేటి (29.5.25) నుండి ఫలితాలు అందుబాటు -వెల్లడించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాల తుది జాబితా బుధవారం రాత్రి ఖరారు చేసినట్లు సమగ్ర శిక్షా …
Read More »ఉపాధ్యాయులు వృత్తిపరమైన సామర్థ్యాలు పెంచుకోవాలి
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, IAS., -ముగిసిన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్ మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి పరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని, తన వద్ద చదువుకునే పిల్లలను తన పిల్లలుగా భావించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా విద్య నేర్పాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, IAS., అన్నారు. కేఎల్ యూనివర్శిటీ(వడ్డేశ్వరం) వేదికగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) , సమగ్ర …
Read More »సింగపూర్లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
-Telugu Desam Forum Singapore (TDFS)ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ కి ఘన నివాళి సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, రాజకీయ దార్శనికుడు, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని TDFS సభ్యులు అపూర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మే 28వ తేదీ సాయంత్రం 8:30 గంటలకు వేడుకలు కేక్ కట్తో ఆరంభమయ్యాయి. ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్నగారి సినీ ప్రస్థానం, ప్రజాస్వామ్యంపై ఆయన చూపిన …
Read More »మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం
-కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ఎన్టీఆర్ ఘనతే -సామాన్యుడిగా పుట్టి ఎంతోమందికి ఎన్టీఆర్ ఆదర్శం -కాపులకు అన్నివిధాలా రుణాలు అందిస్తాం -పేద వాడికి న్యాయం అందించేందుకు ఎన్టీఆర్ నిరంతరం కృషి చేశారు -కొత్తపల్లి సుబ్బారాయుడు, చైర్మన్, ఏపీ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగిన మాజీ ముఖ్మమంత్రి స్వర్గీయ ఎన్.టీ.రామారావు నేడు ఎంతో మందికి ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ …
Read More »ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 31న జాబ్డ్రైవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ శనివారం విజయవాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ డ్రైవ్లో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు 200 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయన్నారు. శాండ్స్పేస్ టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్, హెచ్1 హెచ్ఆర్లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, డేటా వ్యాలీ కంపెనీలో ట్రైనర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముత్తూట్ ఫైనాన్స్లో బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, వరుణ్మోటార్స్ కంపెనీలో …
Read More »జాబ్ మేళా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.30.05.2025 శుక్రవారం నాడు విజయవాడ లోని “కాకరపర్తి భావనారాయణ (కే.బీ.ఎన్ – KBN) కాలేజ్, విజయవాడ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా (JOB MELA)” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. సత్యబ్రహ్మం గారు మరియు …
Read More »వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరం
– మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాను ఆచరించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాద రహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు వాహన చోదకులు కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర-2025 మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని బీఆర్టీఎస్ యోగాస్ట్రీట్ నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ …
Read More »వెటర్నరీ డాక్టర్ ధృవీకరించని ఏ జంతువును వధించకూడదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను 07 జూన్, 2025న జరుపుకుంటారని పేర్కొనబడింది. బక్రీద్ పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను వధించే అవకాశం ఉన్న మాట వాస్తవం. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక (స్లాటర్ హౌస్) రూల్స్, 2001లోని రూల్ 3 ప్రకారం, చట్టం ప్రకారం అధికారం పొందిన సంబంధిత అథారిటీ ద్వారా గుర్తించబడిన లేదా లైసెన్స్ పొందిన స్లాటర్ హౌస్లో తప్ప, మునిసిపల్ ప్రాంతంలో ఏ వ్యక్తి ఏ జంతువును వధించకూడదు. పండుగ వేళ పశువధ నిర్వహించుకొనుటకు …
Read More »Prajavartha e paper 24-31 May-2025 edition
https://prajavartha.com/wp-content/uploads/2025/05/Prajavartha-e-paper-24-31-May-2025-edition.pdf
Read More »
Prajavartha Online Telugu News