Breaking News

Monthly Archives: February 2025

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -కలెక్టర్ పీ.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని , ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం రోజున పీజీఆర్ఎస్ రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో …

Read More »

ఇండియా-పాక్ మ్యాచ్ ను వీక్షించిన మంత్రి నారా లోకేష్‌, ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను ఏసిఏ అధ్యక్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ,విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో వీక్షించారు. మంత్రి నారా లోకేష్,విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) టీమిండియా జెర్సీ లు వేసుకుని మ్యాచ్ ను తిల‌కించారు. వీరితో పాటు ఈ మ్యాచ్ ను వీక్షించిన వారిలో ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, డైరెక్ట‌ర్ …

Read More »

నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కృష్ణ హాస్పిటల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మానవీయ కోణం జోడిరచి ఇక్కడికి వచ్చే …

Read More »

ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్ (రాజా) గెలిపించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కృష్ణ గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్ (రాజా) ఓటర్లను అభ్యర్థించారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కృష్ణ గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అరికల శివరామ ప్రసాద్ ఆదివారం గాంధీనగర్ లోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను అత్యధిక …

Read More »

మిర్చి రైతులను అదుకుంటాం….దీనికి వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలి

-క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు -కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు -కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్‌ల రవాణాకు అనుమతులు -గుంటూరు మార్కెట్ యార్డులో లారీ యజమానుల తీరుపై రైతుల ఫిర్యాదు..చర్యలకు సీఎం ఆదేశం -గుంటూరులోని స్పైస్ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రెండున్నర గంటలపాటు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, కమిషన్ ఏజెంట్లు, అధికారులతో సీఎం సమావేశం అమరావతి, …

Read More »

కుంభమేళాలో పుణ్యస్నానం అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవం

-పులకించి పోయాను -ఈ ఆధ్యాత్మిక అనుభవం అనిర్వచనీయం -వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం యుపిలో కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం నాడు ఆయన ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానమాచరించారు. ఈ పవిత్ర స్నానం తనకు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవంతో పులకింప చేసిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్నానం …

Read More »

శ్రీ భవాని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈనెల 25 వరకు ఉచిత యురాలజీ వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేట్ వైధ్య సేవలు అందరికి అందుబాటులోకి తీసుకురావలనే ఆశయానికి అణుగుణంగా శ్రీ భవాని హాస్పిటల్లో ఈ నెల 21 తేదీ నుంచి 25వ తేదీ వరకు యురాలజీ వైధ్య సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నామని శ్రీభవాని మల్టి స్పెషాలిటీ హస్పటల్ ఛీఫ్ ఆడ్మీనిస్ట్రేటర్ డాక్టర్ దిలీప్ తెలిపారు. 15 తేధినుండి నిర్వహిస్తున్న ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని శ్రీ భవాని హాస్పిటల్ కి చెందిన ఆయన తెలియజేశారు. శనివారం సాయంత్రం భవానీపురంలోని శ్రీ భవాని …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

– 224 మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు – సిబ్బందికి రెండు ద‌శ‌ల్లో పూర్తిస్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు – 112 పోలింగ్ స్టేష‌న్ల‌కు మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న జ‌రిగే కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప‌టిష్ట ఏర్పాట్లు చేశామని.. ఇప్ప‌టికే 224 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో)కు రెండుద‌శ‌ల్లో …

Read More »

నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టెందుకు నియోజకవర్గం పోల్ మేనేజ్ మెంట్ సభ్యులతో గద్దె క్రాంతికుమార్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు వెలగపూడి శంకర్ బాబులు హాజరై సభ్యులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం పట్టభధ్రులు …

Read More »

రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -‘రైతు బడి- అగ్రి షో’ను ప్రారంభించిన మంత్రి -సాగులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు -రాయలసీమకు కృష్ణా జలాల తీసుకొచ్చిన ఘనత టీడీపీదే -వ్యవసాయంలోకి యువత రావాలి -రైతు ద్రోహి జగన్ : మంత్రి సవిత ఫైర్ అనంతపురం /రాప్తాడు,  నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయంలో సాంకేతిక వినియోగంతో అధిక దిగుబడులు సాధించొచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సాగులో సాంకేతికకు …

Read More »