Breaking News

Daily Archives: May 1, 2025

సామాజిక.. ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– పెన్షన్ అందించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదే – హామీ మేరకు ఏప్రిల్ నుండే రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం – గత పాలకులు హామీ ఇచ్చి దగా చేశారు – పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం అని పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించి …

Read More »

సింహాచలం ప్రమాదంపై రాజకీయం సిగ్గు చేటు

– ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు – ప్రకృతి వైపరీత్యాలపై ద్వారా జరిగే ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దు – మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం దేవస్థానం వద్ద చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ… సింహాచలంలో గోడ కూలి మరణించిన వారికి సంతాపం తెలిపారు. బాధిత …

Read More »

విజయవాడపై ఎందుకీ వివక్ష..?

-వైసీపీ హయాంలోనే 99 శాతం వెస్ట్ బైపాస్ పనులు పూర్తి -వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి సర్కారు విజయవాడ అభివృద్ధిపై అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఫలితంగా నగరం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా.. నగరానికి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో 99 శాతం …

Read More »

అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని పునఃప్రారంభించడానికి అంకితభావంతో కృషి చేసిన ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాలు, ట్రంక్ మౌలిక సదుపాయాలు, వరద నివారణ ప్రాజెక్టులు, ల్యాండ్ పూలింగ్ మౌలిక సదుపాయాలు మరియు ఇతరాలు సహా రూ. 58,000 కోట్ల విలువైన రాజధాని నగర పనులను పునఃప్రారంభించడాన్ని …

Read More »

సమ్మర్ క్యాంపు ప్రారంభం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంను రానున్న కాలంలో అత్యాధునిక వసతులతో కూడిన క్రీడా కేంద్రంగ అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం స్థానిక యన్.టి.ఆర్ మునిసిపల్ స్టేడియం లో నెల రోజుల పాటు జరుగనున్న సమ్మర్ క్యాంపు ను నగర్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, పశ్చిమ నియోజకవర్గ యం.యల్.ఎ గల్లా మాధవి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా స్టేడియం …

Read More »

అధికారులు, సిబ్బంది కి తగు ఆదేశాలు జారీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు కేటాయించిన పార్కింగ్, మెయిన్ డయాస్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. గురువారం అమరావతిలో విధులు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా …

Read More »

మే డే కార్మికుల హక్కుల దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే డే సందర్భంగా ప్రజారోగ్య కార్మికులకు మానవత స్వచ్చంద సంస్థ టవల్స్ అందించడం అభినందనీయమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. గురువారం మే డేని పురస్కరించుకుని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మానవత స్వచ్చంద సంస్థ టవల్స్ అందించింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజారోగ్య రక్షణకు పాటుపడే కార్మికులను గుర్తించి వారికి టవల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. మే డే కార్మికుల హక్కుల దినోత్సవమని, గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి నెల 3వ గురువారం …

Read More »

రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది

-ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల మందికి సొంత ఊళ్లలోనే ఉపాధి -నీటి సంక్షోభ నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం -శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణంపోశాయి -మద్యం అమ్మకాల్లో గత పాలకులు రూ. 3200 కోట్లు నొక్కేశారు -సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టారు -ఉపాధి శ్రామికులతో మేడే దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ …

Read More »

కార్మిక సోదరులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా కార్మిక సోదరులకు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలమని.. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయన్నారు. మన సమాజ గతిని.. పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే అని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, కార్మిక సోదరుల సంక్షేమం కోసం పథకాలు …

Read More »

ప్ర‌ధాని మోడీ అమ‌రావ‌తి పున‌రాగ‌మ‌నం-రాష్ట్ర పున‌ర్వికాసానికి శంఖారావం

-ఈ సారి అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేదు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తి పున‌ర్వికాసానికి సంబంధించి ప‌లు ప్రాజెక్టుల‌కు పునాదిరాయి వేయ‌డానికి శుక్ర‌వారం రాష్ట్ర రాజ‌ధానికి వ‌స్తున్నందుకు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతుతున్నాయి. ఆయ‌న పున‌రాగ‌మ‌నం రాష్ట్ర పున‌ర్వికాసానికి శంఖారావం లాంటిద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అత్యుత్త‌మ రాజ‌ధానిగా అమ‌రావ‌తి నిర్మాణానికి 2015లో ప్ర‌ధాన మంత్రి మోడీ శంకుస్థాప‌న చేయ‌గా అప్ప‌టి కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నో అవాంత‌రాల్ని దాటుకుని రాష్ట్ర న‌వ్య రాజ‌ధాని నిర్మాణానికి ప‌లు ప్రాజెక్టుల్ని …

Read More »