విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన ఇంద్రకీలాద్రి క్షేత్రం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, మాస్టర్ ప్లాన్ అమలు గురించి అధికారులతో సోమవారం ఈఓ సీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలో గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించగా ఆయన సూచనల మేరకు సోమవారం ఈ ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, …
Read More »Daily Archives: May 12, 2025
పూర్వ వైభవం దిశగా రీజినల్ సైన్స్ సెంటర్
-ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు యువతలో వైజ్ఞానిక స్ఫూర్తిని కలిగించేందుకు విజయవాడ భవానిపురంలో 2005 నుంచి అందుబాటులో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ (ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం) అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన మండలి ద్వారా నిర్వహించబడుతున్న ఈ విజ్ఞాన కేంద్రంలో క్రమం తప్పకుండా వర్క్ షాప్ లు, విద్యా కార్యక్రమాలు, సైన్స్, ప్లానిటోరియం …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ తిరువూరు అష్టలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండంలో కలెక్టర్ లక్ష్మీశా ఆధ్వర్యంలో జరిగిన తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, పట్టణంలోని కనకా రెసిడెన్సీలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కల్లూరు నుంచి తిరువూరు వరకు భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనటానికి …
Read More »కలెక్టరేట్లో 100 అర్జీల స్వీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం తిరువూరులో జరగ్గా.. విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రజల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం మొత్తం 100 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 37 అర్జీలు రాగా, పోలీసు శాఖకు సంబంధించి 16 అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్కు 7, పురపాలక శాఖకు 6, సర్వే శాఖకు 6 అర్జీలు వచ్చాయి. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మూడు అర్జీలు …
Read More »అర్జీల పరిష్కారంలో సంతృప్తి స్థాయిని పెంచాలి..
-సమస్యను పరిష్కరించాలనే నిబద్ధత అధికారుల్లో ఉండాలి.. -నాణ్యతతో సమస్యను పరిష్కరించినప్పుడే కార్యక్రమానికి సార్థకత.. -అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవు.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీని గడువులోపు పరిష్కరించడం ఎంత ముఖ్యమో.. అర్జీదారుడు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యకు పరిష్కారం చూపడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ …
Read More »స్వర్ణాంధ్ర స్ఫూర్తిని రగిలించే ఇగ్నైట్
– ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమం – ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా కౌన్సెలింగ్ సేవలు – సెల్ ద్వారా సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ పరంగా సలహాలు, సూచనలు – ప్రజల వినూత్న ఆలోచనల డాక్యుమెంటేషన్ సెంటర్గా కూడా ఇగ్నైట్ సేవలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లాస్థాయిలో ఇగ్నైట్ పేరుతో వినూత్న …
Read More »ఆలకించారు.. ఆపన్నహస్తం అందించారు..
-దివ్యాంగునికి గంటలోనే ట్రై సైకిల్ పంపిణీ -ఆనందబాష్పాలతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుని వద్దకే వెళ్ళి సమస్యను ఆలకించి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గంటలోపే అమలుచేసి దివ్యాంగుని కోరికను నేరవేర్చి మానవత్వాన్ని చాటుకున్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణంలో అనుకోని సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అనే అంశంపై నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ముగించుకుని తిరువూరు పర్యటనకు బయలుదేరుతున్న …
Read More »విపత్తు సమయంలో సమయస్ఫూర్తే ఆపద్బాంధవుడు
– భయపడకుండా సరైన నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు కాపాడాలి – విపత్తు నిర్వహణపై అధికారులకూ అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకొని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు సమన్వయ శాఖల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు …
Read More »ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సోమవారం నిర్వహించిన …
Read More »విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించిన క్రీడాకారిణి ‘చైత్రదీపిక’ ను అభినందించి మరిన్ని పతకాలు సాధించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన ‘చైత్రదీపిక’ ను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర హెచ్. ఎం సొమవారం ఉదయం ప్రధాన కార్యాలయం లో అభినందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు …
Read More »
Prajavartha Online Telugu News