జగన్ కు మంత్రి సవిత హితబోధ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా..? అధికారంలో 30 ఏళ్లు ఉంటున్నాంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్… నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖమంత్రి ఎస్.సవిత హితబోధ చేశారు. అసెంబ్లీకి వస్తే సబ్జెక్టుపైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ …
Read More »Monthly Archives: February 2025
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచాలి
-ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు నిబంధనలు వర్తింపు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పరిధిలో అన్ని మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ కే బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజా …
Read More »అదనపు రుసుం వసూలు చేస్తే చర్యలు
-ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సులు రద్దు చేస్తాం…. -జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు లబ్ధిదారుల నుండి అదనంగా నగదు వసూలు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేయటం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి అన్నారు. దీపం-2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు, ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. …
Read More »మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసి ఉంచాలి..
– ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లా పరిధిలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరక్కుండా అన్ని రకాల మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసి ఉంచాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 135 సీ …
Read More »వరి ఆహార వినియోగదారుల ప్రాధాన్యత బట్టి వరి రకాల ఎంపిక మరియు సాగు చేబట్టాలి
-కింజరాపు అచ్చె న్నాయుడు ,వ్యవసాయ శాఖ మంత్రి. -రాబోవు ఖరీఫ్ సీజన్ నారుమళ్ళు కోసం జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి . ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప కి లేఖ రాసిన వ్యవసాయ మంత్రి -వరి సాగు ప్రాంతాల వారీగా వినియోగ దారులు ఎంపిక చేసుకునే వరి రకాలు ,మెరుగైన మార్కెట్ ధర పొందే రకాల వివరాలను సీజన్ కు ముందు నుండే వివరాలను రైతులకు తెలపండి .- పరిశోధన సంచాలకులు Dr పి. సత్యనారాయణ కు తెలిపిన మంత్రి …
Read More »ప్రతిఒక్కరికీ బాధ్యతాయుత ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం
– ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, బ్యాంకర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్బీఐ-ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు (ఫిబ్రవరి 24-ఫిబ్రవరి 28) సందర్భంగా సోమవారం విజయవాడ నోవాటెల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్.. బ్యాంకింగ్ అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 2016 నుంచి ఆర్బీఐ ఏటా అక్షరాస్యత వారోత్సవాలను ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తోందని.. ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు ఇతివృత్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ …
Read More »ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
– పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లను తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాల, లయోలా కళశాలలోని వివిధ పోలింగ్ స్టేషన్లను …
Read More »ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా సహించేది లేదు
– ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సుల రద్దుకూ వెనుకాడం – దీపం-2 అమలు ప్రగతికి లబ్ధిదారుల సంతృప్తే గీటురాయి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపం-2 పథకం ద్వారా అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లకు లబ్ధిదారుల నుంచి అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా సహించేది లేదని, ఫిర్యాదులు రుజువైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దుచేస్తామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లాలో దీపం-2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు, ఫిర్యాదులపై …
Read More »పరిశ్రమల్లో బాయిలర్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలి
-జె. శ్రీనివాసరావు, విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో ఏర్పాటయ్యే బాయిలర్ ల నిర్వహణా విధానాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల పై బాయిలర్ ఆపరేటర్లకు పునఃశ్చరణ తరగతులను భోదించడం జరిగిందని విజయవాడ బాయిలర్ల ఉప ముఖ్య తనిఖీ అధికారి విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి జె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా బాయిలర్ల శాఖ ఆధ్వర్యంలో కృష్ణా …
Read More »రూ. 1770 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ అప్పుల్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తీర్చింది
-ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చామన్న గవర్నర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.1770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని గౌరవ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం ఉభయ సభలనుద్దేశించి చేసిన తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మకత ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోందని గవర్నర్ తెలిపారు. సుస్థిర ఆర్థిక …
Read More »
Prajavartha Online Telugu News