Breaking News

Monthly Archives: February 2025

ఎంఎస్ఎంఈ స‌ర్వేలో వేగం పెంచండి

– పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి స‌ర్వే ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది – య‌జ‌మానుల‌కు ఆర్థికంగా చేయూత‌నిచ్చేందుకు దోహ‌దం చేస్తుంది – యూనిట్ నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌రిచే శిక్ష‌ణ అందించేందుకూ వీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేప‌ట్టిన సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ల (ఎంఎస్ఎంఈ) స‌ర్వేలో వేగం పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి సిబ్బందిని ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఇబ్ర‌హీంప‌ట్నం మూల‌పాడులో గ్రామ స‌చివాల‌య సిబ్బంది …

Read More »

అంబాపురం సర్పంచ్ కబ్జా కోరల నుంచి నా స్థలాన్ని కాపాడండి రిటైర్డ్ ఆఫీసర్ పుల్ల జకరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హై కోర్ట్ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామపంచాయితీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కొరల నుండి నన్ను కాపాడాలని కమర్షియల్ టాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జకరయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నెంబర్ 96 /2 లో వున్నా స్థలాన్ని 2024 లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే …

Read More »

విద్యార్థుల‌కు కీలక సమయం.. అలసత్వం వద్దు..

– పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయండి.. – చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. – ఉపాధ్యాయులకు అత్యవసరమైతేనే శెలవు మంజూరు – జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయ‌మ‌ని.. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ స‌బ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప …

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి

-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ …

Read More »

విశాఖ గాజువాక ‘సంసిధ్’ స్కూల్ లో కోలాహలంగా వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్టణం గాజువాక బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో కోలాహలం గా జరిగాయి. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ప్రధానోపాధ్యాయులు జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ శెట్టి, కో ఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరావు, సుమ ప్రియ, అశ్విని, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.

Read More »

ఘనంగా ఉల్లాస్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలోని 4,15,000 మంది నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని భారత ప్రభుత్వ వయోజన విద్య అండర్ సెక్రటరీ PRADEEP B. HEDAOO అన్నారు. పోరంకిలోని మురళి రిసార్టులో వయోజన విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒక రోజు ‘ఉల్లాస్ మేళా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ వయోజన విద్యా సంచాలకులు కృతికా శుక్లా IAS.,  అన్ని …

Read More »

విజయవాడలో చిల్లపల్లీస్ వీవర్లి ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత పరిశ్రమలో ఐదు దశాబ్దాల అనుభవం మరియు వారసత్వం ఉన్న సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వారి చిల్లపల్లీస్ వీవర్లి విజయవాడ లోని బృందావన్ కాలనీ లోని ఏ కన్వెన్షన్ ఎదురుగా శుక్రవారం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ బ్రాంచ్ తో కస్టమర్ల ఆదరణను మరియు అభిమానాన్ని సంపాదించిన చిల్లపల్లీస్ వీవర్లి ఇప్పుడు విజయవాడకు తన ఉనికిని విస్తరించింది. షోరూంను ప్రఖ్యాత వాణిజ్యవేత్త వల్లూరు అశోక్ బాబు ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మొదటి కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా ఎం …

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి

-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా …

Read More »

ఫిబ్రవరి 9, 10, 11 గుణదల మేరీమాత ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఫిబ్రవరి 9, 10, 11 మూడు రోజులు పాటు జరిగే గుణదల మాత వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నామని విజయవాడ పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ కెదలిక్ పీఠం బిషఫ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ ఈ నూరు వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని ఫిబ్రవరి 8వ తారికు వరకు నవదిన …

Read More »

సుజనా చౌదరి చొరవతో చిన్నారికి గుండె సర్జరీ..

-కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లి తండ్రులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 51 వ డివిజన్ పరిధిలో అప్పల స్వామి వీధి కొండ ప్రాంతానికి చెందిన కె తేజస్విని కుమార్తె కులసాల రాజేశ్వరి 12 నెలల చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది. పడుతుంది. చిన్నారి కు గుండెలో హోల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రైవేటు వైద్యానికి దాదాపు నాలుగు లక్షల రూ ఖర్చవుతుంది అని వైద్యులు తెలపుగా చిన్నారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో …

Read More »