Breaking News

Daily Archives: May 21, 2025

జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన, కమీషనర్, పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రంలోని అందరు జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ క్రింది తెల్పిన ముఖ్య సూచనలు జారీ చేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యం.డి.యూ. వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేతకు నిర్ణయం తీసుకున్న మేరకు, జూన్ 1, 2025 నుండి నిత్యావసర సరుకుల పంపిణీ సంబంధిత …

Read More »

ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలు ప్రేరణాత్మకం

-అభినందించిన రాజస్థాన్ సీమ్యాట్ బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో లీడర్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాల అమలు తీరు బాగుందని, నిపుణ్ భారత్ లక్ష్యాల దిశగా అధునాతనమైన సమగ్ర విద్యా విధాలను అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకమని, తమ రాష్ట్రంలోని కూడా ఈ కార్యక్రమాలు అమలు చేస్తామని రాజస్థాన్ సీమ్యాట్ బృందం ప్రశంసించింది. బుధవారం సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఆగిరపల్లి హీల్ లో లీడర్ షిప్ ట్రైనింగ్, విజయవాడ మ్యారీ స్టెల్లా కాలేజీలో జరుగుతున్న …

Read More »

తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మారటానికి గద్దె రామమోహన్‌ కృషే కారణం : ఎంపీ కేశినేని శివనాథ్

–తూర్పులో కన్నుల పండుగగా మిని మహానాడు –హజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి, నెట్టం రఘురామ్‌ –పసుపుమయంగా మారిన బెంజ్‌సర్కిల్‌ పరిసరాలు, -జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగ్రిన బెంజ్‌సర్కిల్‌ పరిసరాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనత హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్‌ అన్నారు. తూర్పు నియోజకవర్గ …

Read More »

టిడిపిలో ఏ ప‌ద‌వి ఇచ్చినా ఆ ప‌దవికే వ‌న్నె తెచ్చే నాయ‌కుడు నారా లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-తిరువూరులో నియోజ‌క‌వ‌ర్గ స్థాయి మినీ మ‌హానాడు -టిడిపి జెండా ఆవిష్క‌రించిన నెట్టెం ర‌ఘురామ్, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి, అబ్జ‌ర్వ‌ర్ సుఖవాసి శ్రీనివాస్ -ముఖ్యఅతిథిగా హాజ‌రైన టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్య‌ -తిరువూరులో లెద‌ర్ ప‌రిశ్ర‌మ తీసుకువ‌చ్చేందుకు కృషి -జాతీయ అధ్య‌క్షుడుగా ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు కొనసాగాల‌ని తీర్మానం -టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు నెట్టం ర‌ఘురామ్, వ‌ర్ల రామ‌య్య క్ర‌మ‌శిక్ష‌ణ ఆద‌ర్శం తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో వున్న విద్య‌,ఐటీశాఖల మంత్రి …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులు ప్రతి నెల సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు రూపొందించటాన్ని మరింతగా మెరుగుపర్చాలన్న ఉద్దేశ్యంతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారులు ప్రతి నెల సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ శంకరన్ హాల్ లో జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి …

Read More »

జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగ ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , …

Read More »

దాడులకు గురైన బాధితులకు వసతి కల్పిస్తున్న శక్తి సదన్ లు పరిశీలిస్తున్నాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దాడులకు, అన్యాయానికి గురైన మహిళలకు భరోసా, భద్రత కల్పించి వారికి న్యాయం చేయటమే రాష్ట్ర మహిళా కమిషన్ ప్రదాన ఏజెండా అని, దానిలో భాగంగా దాడులకు గురైన బాధితులకు వసతి కల్పిస్తున్న శక్తి సదన్ లు పరిశీలిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ నంబూరులోనీ జెఎంజె శక్తి సదన్ ను, గుంటూరు మహిళా ప్రాంగణంలోని శక్తి …

Read More »

ఉపాధి హామీ ప‌థ‌కంలో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కం

– కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా రైతుల‌ను ప్రోత్స‌హించండి – ఉద్యాన పంట‌ల సాగుతో రైతుల‌కు మెరుగైన ఆదాయాలు – ప‌శుగ్రాసం పెంపకంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ ప‌థ‌కం ఆస‌రాతో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కాన్ని చేప‌ట్ట‌వ‌చ్చ‌ని.. ఈ కార్య‌క్ర‌మంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, స‌ద్వినియోగం చేసుకునేలా ప్రోత్స‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ (డ్వామా) అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. …

Read More »

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలి

-పాత భవనాల్లోని వైరింగ్ పటిష్టత ఆధారంగా విద్యుత్ ఉపకరణాలు వినియోగించాలి -ప్రతి గదికి ఎంసీబీలను ఏర్పాటు చేసుకోవాలి. -ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి -స్మోక్ డిటేక్టర్లను, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఏర్పాటు చేసుకోవాలి. -ప్రతి భవనానికి కచ్ఛితంగా బ్రీతింగ్ బాల్కాని ఉండాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపునిచ్చారు. …

Read More »

ఈ నెల 25న సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాలి

– 10,381 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు 25 కేంద్రాల్లో ఏర్పాట్లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్షను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. క‌లెక్ట‌రేట్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వ‌హ‌ణ‌కు చేయాల్సిన ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క …

Read More »