విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సుజనా చౌదరిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని …
Read More »Monthly Archives: May 2025
‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్ మరియు ఉగ్రవాదం మధ్య సంబంధాన్ని బయటపెట్టింది : హోంమంత్రి అమిత్ షా
-భారతదేశ భద్రతా విధానం ఇప్పుడు స్వావలంబన మరియు నిర్ణయాత్మకమైనది : అమిత్ షా -ఆపరేషన్ సిందూర్: జాతీయ భద్రతలో ఒక నిర్ణయాత్మక క్షణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా 18వ BSF ఇన్వెస్టిచర్ వేడుక మరియు ప్రతిష్టాత్మక రుస్తంజీ స్మారక ఉపన్యాసానికి హాజరయ్యారు, ఇది కేవలం ఒక ఉత్సవ ఉనికి కంటే ఎక్కువ, ఇది దేశం యొక్క భద్రతా స్పృహ యొక్క అద్భుతమైన ప్రకటనగా మారింది. ఇది సాధారణ ప్రదర్శన కాదు, విధానాన్ని …
Read More »విశ్వ యోగ గురు ప్రధాని మోడీ సే యోగాంద్ర ప్రారంభం ఆంధ్రుల అదృష్టం
-యోగ శక్తి సాధనా సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రజల ఆరోగ్యం గాడి తప్పి వింత పోకడలకు దారితీస్తున్న తరుణంలో భారత ప్రధాని మోడీ తన అనుభవంతో భారత వారసత్వ ఆరోగ్య సంపద యోగ ప్రపంచానికి అందించే లాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ ) ను ఒప్పించి విశ్వవ్యాప్తం చేసినందుకు అందరూ ఆయనకి రుణపడి ఉండాలని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. రోగాలు,రుగ్మతలు,క్యాన్సర్లు,సర్జరీలు, ట్రాన్స్ప్లాంటేషన్ మరియు అర్దంతర చావులు పెరిగిన …
Read More »మద్యం షాపులు, బార్లలో నియమ నిబంధనలు సజావుగా అమలు జరిగేలా చూసేందుకు మూడు అంచెలతో స్పెషల్ టీములు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమీషనర్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు జిల్లా లోని మద్యం షాపులు మరియు బార్లలో సమయపాలన, ఇతర నియమ నిబంధనలు సజావుగా అమలు జరిగేలా చూసేందుకు మూడు అంచెలతో స్పెషల్ టీములు ఏర్పాటు చేయటం జరిగిందని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ నగర పరిధిలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను శనివారం డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు, ఎన్ఫోర్సీమెంట్, ప్రొహిబిషన్ ఏక్సైజ్ విజయవాడ అసిస్టెంట్ ఎక్సైజ్ …
Read More »150 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మే 21 నుంచి జూన్ 21 వరకు జరిగే యోగాంధ్ర మాసోత్సవాల్లో జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించి, అమలుచేస్తోంది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో 150 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై పర్యవేక్షించారు. మొరార్జీ దేశాయ్ నేషనల్ …
Read More »కృత్రిమ అవయవాలతో విభిన్న ప్రతిభావంతుల్లో మానసిక ధైర్యం
– ఎన్టీఆర్ ట్రస్టు, సుధీక్షణ్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి, విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా వారిలో మానసిక ధైర్యం లభిస్తుందని.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే శక్తి చేకూరుతుందని.. ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు చేయడం, కృత్రిమ అవయావాలు పంపిణీ చేయడం వంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టు, సుధీక్షణ్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »పాత్రికేయులు యోగాను జీవనమార్గంగా ఎంచుకోవాలి
– ప్రజలకు యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి – జర్నలిస్టుల థీమ్ యోగాకు విశేష స్పందన – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినూత్న కథనాలు, సంచలన వార్తలతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాత్రికేయులకు నిత్యనూతన ఆలోచనా శక్తిని అందించే యోగాను జీవనమార్గంగా పాత్రికేయులు ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శనివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీశ థీమ్ ఆధారిత యోగాభ్యసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాసోత్సవాల …
Read More »యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
-ఏలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.వి. నాగ ప్రభు కుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాటు సారాయి నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0లో భాగంగా తాడేపల్లిగూడెంలోని దీక్ష డి-అడిక్షన్, డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్లో మద్యం, మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్ చడలవాడ నాగరాణి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత మార్గదర్శనంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది. నాగ ప్రభు కుమార్ …
Read More »64 వార్డులలో యోగాంద్ర కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిధిలోని 64 వార్డులో స్పెషల్ ఆఫీసర్లు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర లో భాగంగా వార్డు సచివాలయ సిబ్బంది, ప్రజలు భాగస్వామ్యంతో తమ తమ వార్డుల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సర్కిల్ వన్ పరిధిలోని కేఎల్ రావు పార్క్, సర్కిల్ 2 పరిధిలోని బిఆర్టిఎస్ రోడ్, సర్కిల్ …
Read More »సమిష్టిగా కలిసి పనిచేస్తాం…
-తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర …
Read More »
Prajavartha Online Telugu News